చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చినట్టు రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లు అమిత్షాను శనివారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని ఆయన ఇంట్లో కలిసిన రెజ్లర్లు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు.
హోంమంత్రిని కలిసిన వారిలో రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు. మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఇచ్చిన గడువు శనివారం ముగియడంతో హోంమంత్రి అమిత్షాతో సమావేశానికి రెజర్లు కోరినట్లు తెలుస్తోంది. కాగా, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్పై నిరసనను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించిన రెజ్లర్ గత నెలలో గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అయితే రైతు సంఘం నేత నరేష్ టికాయత్ జోక్యంతో తాత్కాలికంగా విరమించుకున్నారు.
అంతకుముందు, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లు పాదయాత్ర ద్వారా నిరసన తెలిపారు. ఢిల్లీ పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జంతర్ మంతర్లో రెజ్లర్ల నిరసన ప్రదేశాన్ని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు.
కాగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మైనర్ రెజ్లర్ తండ్రి, ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రిజ్ భూషణ్పై ఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వస్తున్న ఆరోపణలపై ఈ కేసులో తాను నార్కో టెస్ట్కు కూడా సిద్ధమేనని ప్రకటించారు.
More Stories
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ నేడే
మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో