బాలాసోర్ విషాద రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, మరో 100 మంది పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. అంతకుముందు ఒడిశాకు చేరుకున్న ఆయన రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచిన భువనేశ్వర్ ఎయిమ్స్ను సందర్శించారు. “ఢిల్లీ ఎయిమ్స్ , ఇతర ఆసుపత్రుల నుంచి నిపుణులైన వైద్యుల బృందం భారత వైమానిక దళం (ఐఎఎఫ్) ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంది. వారు అత్యాధునిక పరికరాలు, మందులతో చికిత్స చేయనున్నారు ”అని మాండవ్య తెలియజేశారు.
రోగుల పరిస్థితి, వారు చేరిన ఆసుపత్రులు, వారికి ఎలాంటి చికిత్స అవసరం, నిపుణుల బృందం వారికి ఎలా సహాయం చేయగలదో సమగ్ర సమీక్ష జరిపామని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు. అధునాతన చికిత్స అందించడం కోసం వర్కింగ్ ప్లాన్ అమలవుతోందన్న ఆయన బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందికి సహాయం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్తో సహా వివిధ ఆసుపత్రుల నుంచి నిపుణుల నిపుణుల బృందం ఒడిశాకు చేరుకుంది.
రైలు ప్రమాదంలో బాధితుల క్లెయిమ్ పరిష్కారం కోసం భారత జీవిత భీమాసంస్థ (ఎల్ఐసి)పలు ఉపశమనాలను ప్రకటించింది. రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు క్లెయిమ్ పరిష్కారాలను వేగవంతం చేస్తామని తెలిపింది. ఎల్ఐసి పాలసీలు, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్లెయిందారుల కష్టాలను తగ్గించడానికి, ఎల్ఐసి క్లెయిమ్ పరిష్కారం కోసం వివిధ రాయితీలను ప్రకటించింది.
“రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికేట్లకు బదులుగా, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రచురించిన మరణాల జాబితా మరణానికి రుజువుగా అంగీకరించబడుతుంద”ని సంస్థ తెలిపింది. క్లెయిమ్ కు సంబంధిత సందేహాలకు ప్రతిస్పందించడానికి, హక్కుదారులకు సహాయం అందించడానికి ఎల్ఐసి డివిజనల్, బ్రాంచ్ స్థాయిలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసింది.
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం