
ఇలా ఉండగా, అంతకు ముందు రోజే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆకస్మిక ఐరోపా పర్యటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే అధ్యక్షులతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జర్మనీలో అడుగుపెట్టిన ఆయన ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ స్కాల్జ్తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా ఆక్రమించిన ప్రాంతాలకు తిరిగి స్వాధీనం చేసుకోడానికి ఎదురుదాడికి దిగుతామని జెలెన్స్కీ చెప్పారు. అయితే రష్యా భూభాగంపై దాడులకు పాల్పడబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దు ప్రాంతాలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
అంతేకాదు, ఆక్రమించుకున్న తమ భూభాగాలను రష్యా నుంచి తీసుకుంటామని, మాస్కోపై దాడి చేసేంత ఆయుధ సంపత్తి, సామర్ధ్యం తమకు లేదని చెప్పారు. తమకు సాయంగా 300 కోట్ల డాలర్ల విలువైన మిలటరీ సాయం చేసిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్కు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసా ప్యాలెస్లో ఇమ్యానుయేల్ మెక్రాన్ను కలిశారు. అవసరమైన సైనిక సాయం చేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘ఉక్రెయిన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడం.. కీవ్ అత్యంత తక్షణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కొత్త సాయం సిద్ధం చేస్తున్నాం’ అని హామీ ఇచ్చారు. అటు నుంచి సోమవారం ఉదయం యూకేకు చేరుకున్న జెలెస్కీ.. ఆ దేశ ప్రధాని రిషి సునాక్ను కలుసుకున్నారు.
More Stories
విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మృతి
అహ్మదాబాద్లో కుప్పకూలిన విమానం… 242 మంది ప్రయాణికులు
50 ఏళ్ళ క్రితం చరిత్ర గతిని మార్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు!