పూర్తిగా ఫలితాలు వెల్లడైన తరువాత పూర్తి స్థాయిలో ఆత్మ విమర్శ చేసుకుంటామని చెప్పారు. ఫలితాలపై సంపూర్థ విశ్లేషణ చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. ‘‘ఒక జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఈ ఎన్నికల్లో గెలుపు, ఓటములకు సంబంధించిన పూర్తి స్థాయి సమీక్ష జరుపుతాం. వివిధ స్థాయిల్లో ఏయే విషయాల్లో దెబ్బతిన్నామనే విషయాన్ని విశ్లేషిస్తాం’’ అని వివరించారు.
ఈ ఎన్నికల ఫలితాలను పార్టీ అంగీకరిస్తోంది. పొరపాట్లను, తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుని రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతామని బొమ్మై స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీలోని లోటుపాట్లను సరిదిద్ధి, పార్టీని మళ్లీ రీ ఆర్గనైజ్ చేసి, రానున్న లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒక గుణపాఠంగా స్వీకరిస్తామని చెప్పారు.
గెలుపు, ఓటములు బిజెపికి కొత్త కాదు

More Stories
హర్మూజ్లో నౌకాయాన స్వేచ్ఛ కీలకం.. ఇరాన్ అధ్యక్షునితో మోదీ
అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు.. కేంద్రం అప్రమత్తం
ఎస్ఐఆర్ పై సీజేఐకు ఫిర్యాదులో కాంగ్రెస్ తో చేరిన డీఎంకే, ఆప్