సమాజంలో ఏం జరిగినా నిశితంగా అధ్యయనం చేయాలని సూచిస్తూ 21వ శతాబ్దపు శరవేగంగా మారుతున్న కాలంలో, భారతదేశ విద్యా విధానం మారుతోందని, ఉపాధ్యాయులు మారుతున్నారని, విద్యార్థులు కూడా మారుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మారుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు వెళతామనేది ముఖ్యమని చెప్పారు.
ఇంతకుముందు ఉపాధ్యాయులకు వనరుల కొరత, మౌలిక సదుపాయాలు వంటి సవాళ్లు ఉన్నాయని, విద్యార్థుల నుండి ప్రత్యేక సవాలు లేదని చెప్పారు. అయితే, నేడు వనరులు, మౌలిక సదుపాయాల సమస్య అధిగమించబడుతుందని, కానీ నేటి విద్యార్థుల ఉత్సుకత ఉపాధ్యాయులకు సవాలుగా మారుతోందని ప్రధాని వారించారు.
ఎందుకంటే వారు తమ పుస్తకాలను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారని చెబుతూ ఇక్కడ కూర్చున్న ఉపాధ్యాయులు ప్రతిరోజూ దీనిని అనుభవిస్తూ ఉండొచ్చని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని ఉపాధ్యాయులను ప్రధాని మోదీ కోరారు.
మీరు గూగుల్ నుండి డేటాను పొందవచ్చని.. కానీ ఆ విషయం మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు. గురువు తన సమాచారాన్ని ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో గురువు మాత్రమే మార్గనిర్దేశం చేయగలడని పేర్కొన్నారు. సాంకేతికత సమాచారాన్ని అందించగలదు కానీ ఉపాధ్యాయుడు మాత్రమే సరైన దృక్పథాన్ని చూపగలడని ప్రధాని స్పష్టం చేశారు.
ఏ సమాచారం ఉపయోగపడుతుందో, ఏది కాదో గురువుకు మాత్రమే చక్కగా చెప్పగలడని అంటూ దీనితో పాటు ఒక టీచర్ తన పిల్లలకు మంచి టీచర్ కావాలని కోరుకున్నట్లే, ప్రతి తల్లితండ్రులు తమ పిల్లలకు మంచి టీచర్ కావాలని కోరుకుంటారని ప్రధాని గుర్తు చేశారు. వారి ఆలోచనలు, చర్యలు, మాటలు, ప్రవర్తన నుండి విద్యార్థి చాలా నేర్చుకుంటాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు.
గాంధీనగర్లో రూ.4,400 కోట్ల ప్రాజెక్టుల్లో కొన్నింటికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని దేశానికి అంకితం చేశారు. ‘గృహ ప్రవేశ్’ స్కీమ్ కింద నిర్మించిన 19 వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.
More Stories
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై అందరి దృష్టి
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్