పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హనుమకొండ జిల్లా కోర్టు కొట్టేసింది. సంజయ్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నాడంటూ, బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు.
గత రెండు రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంజయ్ బెయిల్ను రద్దు చేసే కారణాలు లేవంటూ కొట్టేస్తూ రూలింగ్ ఇచ్చింది. కొన్ని షరతులపై బండి సంజయ్ను బెయిల్పై విడుదల చేయాలంటూ కోర్టు ఏప్రిల్ 6న ఉత్తర్వు ఇచ్చింది. కరీంనగర్లో ఏప్రిల్ 4న పెద్ద డ్రామా తర్వాత బండి సంజయ్ను ఆయన మామగారి ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు.
పదవ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో సంజయ్ ప్రధాన నిందితుడిగా వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రం నుంచి ఈ హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయింది. బండి సంజయ్ను అరెస్టు చేశాక యాదగిరి భువనగిరి జిల్లా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత వరంగల్కు సాయంత్రం తీసుకొచ్చారు.
హన్మకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను ప్రవేశపెట్టారు. మెజిస్ట్రేట్ ఆయనను ఏప్రిల్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తూ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. కోర్టు మరునాడే బెయిల్ ఇచ్చేసింది.
పదవ తరగతి పరీక్ష పత్రాల లీక్లో సంజయ్ పెద్ద కుట్ర పన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఐపిసి సెక్షన్లు 120బి, 420, 505 కింద సంజయ్తో పాటు మరో తొమ్మిది మంది నిందితులను కూడా బుక్ చేశారు. పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ పరీక్షలు(మాల్ ప్రాక్టీస్ నిరోధకం) లోని సెక్షన్లు 4(ఎ), 6, ఇంకా ఐటి చట్టం లోని 66డి సెక్షను కింద కూడా కేసులు పెట్టారు.
More Stories
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్
తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం