తమిళనాడు రాష్ట్రంలోని సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, బాంకెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాలు, గృహ కార్యక్రమాలలో మద్యం అందించడానికి ప్రత్యేక లైసెన్స్ విధానాన్ని తీసుకువచ్చింది. తమిళనాడులో మద్యం అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలకు భిన్నంగా స్టాలిన్ ప్రభుత్వం తాజా చర్య తీసుకుంది.
2016లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్యం అమ్మకాలపై కొరఢా ఝుళిపించింది. ఏకంగా 500 మద్యం దుకాణాలను మూసివేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల టైమింగ్స్ ను తగ్గించింది. జయ మరణం తర్వాత సీఎం పీఠం ఎక్కిన ఎడప్పాడి కె. పళనిస్వామి జయలలిత తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించారు.
ఫిబ్రవరి 20, 2017న ప్రభుత్వ రంగ టాస్మాక్ ఆధ్వర్యంలో నడిచే 500 మద్యం దుకాణాలను మూసివేయించారు. ఇందులో భాగంగానే ఓ పన్నీర్సెల్వం ప్రభుత్వం జనవరి 2002లో టాస్మాక్ ద్వారా తక్కువ ధరకు మద్యాన్ని విక్రయించే విధానాన్ని ప్రారంభించింది.
More Stories
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 10
అమిత్ షాపై నకిలీ వీడియో.. ముంబైలో 16 మందిపై కేసు