జీఎస్టీ ఎగవేతలను ఆపడానికి ప్రభుత్వం డేటా ఎనలిటిక్స్ టెక్నాలజీని వాడుతోంది. ఏదైనా సెక్టార్లోని మొత్తం సప్లయ్ చెయిన్ సరిపడినంత జీఎస్టీ కడుతుందా? లేదా? అనేది దీని ద్వారా విశ్లేషిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలను అధికారులు గుర్తించారు.
ఎగవేతలను స్టార్టింగ్ స్జేజ్లోనే గుర్తించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెనన్స్ (డీజీజీఐ) చర్యలు ముమ్మరం చేసింది. డేటా ఎనలిటిక్స్ను వాడి ఒక సెక్టార్ చెల్లిస్తున్న ట్యాక్స్ పేమెంట్స్ను, ఇదే సెక్టార్ చెల్లించిన సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి ట్యాక్స్లతో పోలుస్తున్నామని ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
‘జీఎస్టీ వ్యవస్థ నిలకడగా మారడంతో మరింతగా బలపరచడానికి అవకాశం దొరికింది. జీఎస్టీ కింద ఉన్న అన్ని సెక్టార్లు తమ వాటా ట్యాక్స్ను చెల్లిస్తున్నాయా? లేదా? అనేది కన్ఫార్మ్ చేసుకుంటున్నాం’ అని వివరించారు. విశ్లేషణ చేసిన తర్వాత జీఎస్టీ సిస్టమ్లోని ఎగవేతలను గుర్తించడానికి ట్యాక్స్ లేదా టారిఫ్స్కు సంబంధించిన సవరణలు చేయాలంటే జీఎస్టీ కౌన్సిల్ వద్ద ప్రపోజల్స్ పెడతామని పేర్కొన్నారు.
సెక్టార్లోని ఏదైనా బిజినెస్ జీఎస్టీ ఎగవేసిందని గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ‘డేటా ఎనలిటిక్స్ వాడడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ, జీఎస్టీ ఎగవేతలను మాన్యుఫాక్చరింగ్ స్జేజ్లోనే గుర్తించడానికి ఇది అవసరం. రూల్స్ సరిగ్గా అమలు కావడంలో, ప్రభుత్వ రెవెన్యూ పెరగడంలో డేటా ఎనలిటిక్స్ సాయపడుతోంది’ అని తెలిపారు.
ఏడాది ప్రాతిపదికన చూస్తే 2022–23 లో గుర్తించిన జీఎస్టీ ఎగవేతల విలువ రెండింతలు పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు పెరిగింది. వీటికి సంబంధించిన కేసులు కూడా 14,000కు చేరుకున్నాయి.
More Stories
బంగారం స్మగుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘన్ దౌత్యవేత్త
మసాలా సుగంధ ద్రవ్యాలపై దేశవ్యాప్తంగా తనిఖీలు
చైనాలో ఆర్థిక సవాళ్లు నిజమేనన్న జిన్పింగ్