వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె డా. నర్రెడ్డి సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు అవినాష్ బెయిల్ పిటిషన్ సవాలు చేస్తూ డా.సునీత దాఖలు చేసిన పిటిషన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చారని, జగనే నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించారు.
అవినాశ్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతే జగన్ యాక్టివ్ అయ్యారని ఆమె ఆరోపించారు. ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతో అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రముఖులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారన్న డా.సునీత ఆరోపించారు.
More Stories
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం.. సిఐడి దర్యాప్తుకు ఈసీ ఆదేశం