ఆర్మీ, పోలీసు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు పాక్లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉంటారని భావిస్తున్నారు. తొలుత ఇది ట్రక్కు జరిగిన ప్రమాదమని అందరు భావించారు. కానీ ఇదొక ఉగ్రదాడి అని తేలింది.
ట్రక్పై 25కి పైగా బుల్లెట్లు ఉన్నాయి. దీని బట్ ట్రక్కు నలువైపుల నుంచి దాడి జరిగినట్టు స్పష్టమైంది. ఘటనలో ఏడుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో రెండు గ్రూపులుగా ఉగ్రవాదులు ఆపరేట్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
బాట-దోరియా ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చట్టుముట్టేశారు. డ్రోన్లు, స్నిఫర్ శునకాల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఉగ్రవాదులు తప్పించుకోలేకుండే ప్రణాళికలు రచించారు.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి