
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడర్(తో పాటు ఇతర ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు వేలాది మంది కేసులు దాఖలు చేశారు. అయితే ఆ కేసుల్లో సెటిల్మెంట్ కోరుతున్న జాన్సన్ కంపెనీ తాజాగా ఓ ప్రతిపాదన చేసింది.
దివాళా కోర్టును ఆశ్రయించిన ఆ కంపెనీ మొత్తం కేసుల పరిష్కారం కోసం 9 బిలియన్ల డాలర్లు చెల్లించనున్నట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నది. ఒక్క అమెరికాలోనే సుమారు 40 వేల కేసులు జాన్సన్ కంపెనీపై ఉన్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీపై వేసిన కేసుల్ని విలువైనవే అని గుర్తిస్తున్నట్లు చెప్పిన ఆ కంపెనీ న్యాయపోరాటంలో భాగంగా సెటిల్మెంట్ను పెంచినట్లు అంగీకరించింది.
గతంలో రెండు బిలియన్ల డాలర్లు ఇస్తానని చెప్పిన ఆ కంపెనీ ఇప్పుడు తన సెటిల్మెంట్ను 9 బిలియన్ల డాలర్లకు పెంచడం గమనార్హం. జాన్సన్ కంపెనీపై కేసు వేసిన 40 వేల మంది.. ఆ కంపెనీ ఉత్పత్తుల్లో క్యాన్సర్కు కారణమైన అస్బెస్టాస్ ఉన్నట్లు ఆరోపణలు చేశారు.
2020 నుంచే అమెరికాలో ఆ కంపెనీకి చెందిన టాల్కమ్ పౌడర్ అమ్మకాలను ఆపేశారు. ఇక గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల అమ్మకాన్ని ఆ కంపెనీ నిలిపివేసింది. బాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ దాదాపు 130 ఏళ్ల నుంచి తమ ఉత్పత్తుల్ని సేల్ చేస్తోంది.
More Stories
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు
ఎస్బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్లు తగ్గింపు