వార్దక్ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్ ఫ్లైట్లో కుమారుడితో కలిసి దుబాయ్ నుంచి భారత్ వచ్చారు. ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆమె గ్రీన్ ఛానెల్ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. అయితే, వార్దక్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ముందుగానే సమాచారం అందింది.
దీంతో వారు అలర్ట్ అయ్యి ఎయిర్పోర్ట్లో సిబ్బందిని మోహరించారు. కానీ, దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకుని స్మగ్లింగ్ గురించి ఆరా తీశారు. బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా? అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె అలాంటివేమీ తమ వద్ద లేవని సమాధానం చెప్పారు.
దీంతో అధికారులు వార్దక్ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా ఆమె బండారం మొత్తం బయటపడింది. ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్, లెగ్గిన్, మోకాలి క్యాప్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆమె కుమారుడి వద్ద మాత్రం ఎలాంటి బంగారం కనిపించలేదు. దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేయడం చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా వార్దక్ను డీఆర్ఐ అధికారులు అడగ్గా ఆమె చూపించలేకపోయింది. దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ దౌత్యవేత్తపై కస్టమ్స్ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. కానీ, వార్దాక్కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు.
More Stories
వచ్చేనెల పిఎం కిసాన్ నిధులు విడుదల
ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్లో ఆప్ పేరు
భారత వృద్ధి రేటు అంచనాలను 7 శాతంకు పెంచిన ఐరాస