30 బృందాలు ఇందుకోసం పని చేస్తున్నాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. తాజ్ యెశ్వంత్పూర్, షాంగ్రి లా బెంగళూరు వంటి ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 26 హోటళ్లను తనిఖీ చేయగా, అనేక చోట్ల తీవ్రమైన ఉల్లంఘనలు కనిపించాయి. సాధారణంగా స్టార్ హెటల్స్ అనగానే ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తారని అనుకుంటారు.
కానీ, ఇక్కడ చాలా చోట్ల కనీస ప్రమాణాలు పాటించట్లేదని, పాడైన, ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన కూరగాయలు, మాంసం, పాలు, ఇతర తయారు చేసిన పదార్థాలనే వాడుతున్నట్లు తేలింది. ఈ హోటళ్ల నుంచి చికెన్, మటన్, చేపమాంసం, ఆయిల్, పాలు, మసాలాలు, టీ పౌడర్, చీజ్, సాసెస్ వంటి అనేక పదార్థాల శాంపిల్స్ సేకరించి, వాటిని పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపించారు. అనేక హోటళ్లలో కిచెన్లో పారిశుధ్యం లోపించినట్లు గుర్తించారు.
అలాగే, కుళ్లిన కూరగాయల్ని వాడుతున్నారు. ఎప్పుడో తయారు చేసిన ఆహార పదార్థాలు పాడైనప్పటికీ వాటిని మళ్లీ వినియోగిస్తున్నారు. కొన్నింటికి ఫంగస్ సోకి ఉంది. ఆహార పదార్థాల నిర్వహణ, భద్రత కూడా సరిగ్గా లేదు. కొన్ని పదార్థాలపై తప్పుడు లేబుల్స్ ఉన్నాయి. అలాగే, శాకాహార, మాంసాహారాన్ని ఒకే చోట కలిపి ఉంచారు. నిబంధనలకు ఇది విరుద్ధం. వెజ్, నాన్వెజ్ ఐటమ్స్ వేర్వేరుగా ఉంచాలి.
లలిత్ అశోక్ హోటల్ నుంచి 76 కేజీల మాంసం, 200 కేజీల కూరగాయలు, 32 లీటర్ల పాలు పాడైనట్లు గుర్తించి, వాటిని నాశనం చేశారు. వివాంటా బెంగళూరు, షాంగ్రి లా బెంగళూరు, తాజ్ యెశ్వంత్పూర్ వంటి ప్రముఖ హోటళ్లలో కూడా కుళ్లిన మాంసం, కూరగాయలు, పాలు, బేకరి ఐటమ్స్ గుర్తించి ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈ హోటళ్లు అన్నింటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

More Stories
భారత్, చైనాలతో సహా 5 దేశాలపై అమెరికా 100 శాతం టారిఫ్!
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు భారత్ ఆంతరంగిక విషయం
నీట్ ప్రశ్నలను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు