కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీసుకొచ్చిన రిజర్వేషన్ పాలసీని ప్రజలు స్వాగతించారని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే కాంగ్రెస్ ఆందోళన చేస్తోందని విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారత్ లో రిజర్వేషన్లు కాస్త భిన్నంగా ఉంటాయని స్పష్టం చేశారు.
మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదకనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టత ఇచ్చారు. ఈ రిజర్వేషన్ విధానంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆయన దుమ్మెత్తి పోశారు.
రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి మేనియా ప్రతి రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభావం ఎలాంటిదో రుజువైందని తెలిపారు. ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మే 10న ఒకే విడతలో 224 స్థానాలకు పోలింగ్ని నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మే 13న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టలేదు. దీంతో ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్రను తిరగరాయాలని బీజేపీ పట్టుదలతో ఉంది.
రాహుల్ గాంధీపై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు గుప్పించారు. ఓబీసీలపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలా ఓబీసీ వర్గాన్ని కించపరచడం రాహుల్కి ఇదేమీ తొలిసారి కాదని ఆయన చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సఫలం కాలేదని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు.
నూతన విద్యావిధానం
More Stories
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి