5జీ కోసం జియో లక్ష టవర్లు

ముకేష్ అంబానీకి చెందిన టెల్కో రిలయన్స్ జియో దేశమంతటా 5జీ సేవలను అందించడానికి దాదాపు లక్ష టెలికాం టవర్లను ఏర్పాటు చేసింది. ఎయిర్​టెల్​ టవర్లతో పోలిస్తే వీటి సంఖ్య దాదాపు 5 రెట్లు ఎక్కువ. డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్​) లెక్కల ప్రకారం జియో దాని  2 ఫ్రీక్వెన్సీలలో (700 మెగాహెజ్,​  3,500 మెగాహెజ్) 99,897 బీటీఎస్​ (బేస్ ట్రాన్స్‌‌ రిసీవర్​ స్టేషన్)లను ఇన్‌‌స్టాల్ చేసింది.

ఎయిర్‌‌టెల్  నెట్​వర్క్​లో 22,219 బీటీఎస్​లు మాత్రమే ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌‌కు  జియో 3 సెల్ సైట్లను నిర్మించడానికి, ఎయిర్​టెల్ రెండు చొప్పున నిర్మించింది. ఎక్కువ టవర్  సెల్ సైట్స్​ ఉండటం వల్ల నెట్​ వేగం బాగుంటుంది.  ఓక్లా  ఫిబ్రవరి 28న విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఎయిర్​టెల్​5జీ స్పీడ్​  268 ఎంబీపీఎస్​ కాగా, జియో నెట్​వర్క్​ స్పీడ్​ 506 ఎంబీపీఎస్​ (సెకనుకు మెగాబైట్లు) ఉంది.

భారత్ లో దాదాపు 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. స్మార్ట్​ఫోన్ల వాడకం భారీగా పెరగడమే ఇందుకు కారణం. చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ఆన్‌‌లైన్ మార్కెట్‌‌గా నిలిచింది. 5జీ టెలికాం సేవలు 2022 అక్టోబర్​లో  ప్రారంభమయ్యాయి. 5జీ  నెట్​వర్క్​ కోసం జియో 25 బిలియన్​ డాలర్లను పెట్టుబడి పెట్టింది.    

ఎయిర్‌‌టెల్ తన మూలధన పెట్టుబడులను 4జీ నుంచి తన 5జీ నెట్‌‌వర్క్‌‌కు మళ్లిస్తోంది.  అయితే 2జీ నెట్‌‌వర్క్‌‌ను మూసివేసే ఆలోచన లేదని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు.   తమ రేడియోలన్నింటినీ ఒకే ఆర్.ఎ.ఎన్​లో నడుపుతున్నందున 2జీని నిర్వహించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువని, ఇప్పటికీ 2జీ ఫోన్లను ఉపయోగిస్తున్నవారి సంఖ్య భారీగా ఉంది కాబట్టి 2జీని ఆపేయబోమని స్పష్టం చేశారు.

భారత్ లో ఇప్పటికీ  -35 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు 2జీని ఉపయోగిస్తున్నారు. ఎయిర్​టెల్​కు దాదాపు 10 కోట్ల మందికిపైగా 2జీ యూజర్లు ఉన్నారు.  కరోనాకు ముందే, ఎయిర్‌‌టెల్ తన 3జీ నెట్‌‌వర్క్‌‌ను మూసివేసింది.  దాని రేడియోలను 4జీకి వాడుకుంటోంది.