
పద్మ అవార్డుల ప్రధానోత్సవం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. 2023కుగానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రముఖులకు ముర్ము పద్మ అవార్డులు అందించారు. 9 మందికి పద్మభూషన్, 91 మందికి పద్మ అవార్డులు దక్కాయి.
పద్మ విభూషణ్ అందుకున్న వారులో ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం), తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ బాలకృష్ణ దోషి (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలబినస్ (మరణానంతరం), ఇండో అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ ఉన్నారు.
పద్మ విభూషణ్ అందుకున్న వారులో ములాయం సింగ్ యాదవ్ (మరణానంతరం), తబలా వాయిద్యకారుడు జాకీర్ హుస్సేన్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ బాలకృష్ణ దోషి (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలబినస్ (మరణానంతరం), ఇండో అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ ఉన్నారు.
అలాగే పద్మభూషణ్ అవార్డుకు వాణీజయరాం, చిన్నజీయర్స్వామి, సుమన్ కల్యాణ్పూర్, కపిల్ కుమార్, సుధామూర్తి, కమలేష్ మూర్తి, కమలేష్ డీ పటేల్, సుకుమా ఆచార్య, జోదియాభాయ్ భాగియా ఎంపికయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన చింతల పాటి వెంకట పతి రాజు (కళారంగం, ఆంధ్రప్రదేశ్), కోటా సచ్చిదానంద శాస్త్రి(కళా రంగం, ఆంధ్రప్రదేశ్), తెలంగాణకు చెందిన పసుపులేటి హనుమంతరావు (మెడిసిన్), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం)లు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. మ్యూజిక్ ఆర్టిస్ట్ మంగళ కాంతా రాయ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.
పాండ్వానీ సింగర్ ఉషా బర్లే, చునారా కమ్యూనిటీకి చెందిన కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, పంజాబీ స్కాలర్ డాక్టర్ రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్ఝున్వాలా(దివంగత) త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా(దివంగత), కాంతా ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ ప్రీతికాకా గోస్వామి, బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త.. కళాకారుడు దిల్షద్ హుస్సేన్ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు అఅందుకున్నారు.
More Stories
క్రికెట్ బుకీని పట్టించిన అమృతా ఫడ్నవీస్
రక్షణ రంగంలో భారత్, అమెరికా పారిశ్రామిక సహకారం
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?