
ఇక కేవలం ప్రవీణ్ పెన డ్రైవ్ మాత్రమే కాకుండా ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితుల ఫోన్లను కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇస్ మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, ప్రశ్నాపత్రాల కొనుగోలు కోసం తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆమె తన సోదరుడు రాజేశ్వర్ నాయక్కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్తో రేణుక బేరం కుదుర్చుకుంది. టీటీసీ చదివిన రాజేశ్వర్ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్తో చెప్పింది.
అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కె.నీలేష్నాయక్, పి.గోపాల్ నాయక్లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్ రూ.3.5 లక్షలు ఆన్లైన్లో పంపినట్టు పోలీసులు గుర్తించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్కు ప్రవీణ్ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి