
ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్లో 70 కోట్ల నిధులు దారి మళ్లాయని ఇడి తెలిపింది. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మెటీరియల్, సర్వీసెస్ సప్లై పేరుతో ఈ నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్కు, అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని చెప్పింది.
సీమెన్స్ ప్రాజెక్ట్ కు ఇవ్వాల్సిన నిధులను తరలించారని తెలిపింది. ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా మాజీ ఫైనాన్సియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టర్డ్ అకౌంటెంట్ సురేశ్ గోయల్ లను మనీ లాండరింగ్ కింద అరెస్ట్ చేశామని తెలిపింది.
వీరిని విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ కోర్టు ఏడు రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించింది. ఎపి సిఐడి నమోదు చేసిన ఎప్ఐఆర్ ఆధారంగా ఇడి విచారణ చేపట్టింది. ఇలా ఉండగా, స్కిల్ డెవల్పమెంట్ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను పగటి వేళల్లోనే (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు) విచారించాలని ఈడీకి హైకోర్టు స్పష్టం చేసింది. రాత్రివేళ్లలో విచారించడంపై అభ్యంతరం తెలిపింది. ఈడీ విచారిస్తున్న తీరుపై అఫిడవిట్ దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
More Stories
వివేకా హత్యకేసులో విచారణాధికారిని మార్చమన్న సుప్రీంకోర్టు
కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాదన్న టైబ్యునల్
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం – 3 రాకెట్