
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ నోటీసులపై తనకు తాత్కాలిక ఊరట ఇవ్వాలన్న ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు.
కవిత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మార్చి 16న ఈడీ అధికారుల ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సింది ఉంది. ఈ సమయంలోనే విచారణకు బ్రేక్ వేయాలంటూ, ఈడీ ఎదుట హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే మార్చి 11న కవితను 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. 16వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇతరులతో కలిపి విచారిస్తామని తనకు ఇచ్చిన నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారని, కానీ వాస్తవానికి అలా విచారణ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ సీజ్ చేశారని ఆమె ఆరోపించారు.
ఇలా ఉండగా, ఢిల్లీకి మించి తెలంగాణలో భారీ లిక్కర్ స్కాం జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని వెల్లడించాయిరు. ఫారిన్ లిక్కర్ సేల్స్లో ఒక వ్యక్తికి వందల కోట్లు లబ్థి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ళ కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేలాలన్నారు. ఫారిన్ లిక్కర్ టెండర్కు 24 గంటలే సమయం ఇవ్వటానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు.
More Stories
పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం