సరిహద్దు వెంబటి సైనికులను సమీకరించుకొంటూ రెచ్చగొట్టే విధంగా చైనా వ్యవహరిస్తుండగా, భారత్ సహితం తగురీతిలో సమాధానం చెబుతుంది. . రెండుదేశాల మధ్య వివాదానికి కేంద్రంగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో క్రికెట్ తో పాటు ఐస్ హాకీ పోటీల్లో పాల్గొన్నార భారత సైనికులు పాల్గొన్న చిత్రాలు ఈ సందర్భంగా కలకలం రేపుతున్నాయి.
చైనా బెదిరింపులకు బెదిరిపోయే ప్రసక్తి లేదంటూ సందేశం ఇవ్వడానికే ఈ చిత్రాలను భారత సైన్యం అధికారికంగా విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది.
గల్వాన్లో ఎక్కడ ఆటలు ఆడారనే విషయాన్ని ఆర్మీ స్పష్టంగా ఎప్పకపోయినా పెట్రోలింగ్ పాయింట్-14కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆటలు ఆడి ఉండవచ్చని సమాచారం.
ఢిల్లీలో నిర్వహిస్తున్న జీ20 సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ మంత్రితో సమావేశమైన తర్వాత రోజునే ఇండియన్ ఆర్మీ ఫొటోలను విడుదల చేయడం విశేషం. త్రిశూల్ డివిజన్కు చెందిన పాటియాలా బ్రిగేడ్ ఆర్మీ పోటీలను నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరో వైపు సరిహద్దుల్లో సైన్యం గుర్రాలపై పహారా కాస్తుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సముద్రమట్టానికి అధిక ఎత్తులో, విపరీతమైన చలి పరిస్థితులు ఉన్నా వివిధ క్రీడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ జవాన్లు ఎంతో ధైర్యంతో ఉన్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
2020 మేలో భారత్ – చైనా సైనికుల మధ్య గల్వాన్ ప్రాంతంలో ఘర్షణ జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో భారత్కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. పెద్ద సంఖ్యలో చైనా సైనికులు సైతం ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకు చైనా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్