![ఉద్ధవ్ను సీఎం పీఠం ఎక్కించి బలిచ్చే గొర్రెపిల్లలా మార్చారు ఉద్ధవ్ను సీఎం పీఠం ఎక్కించి బలిచ్చే గొర్రెపిల్లలా మార్చారు](https://nijamtoday.com/wp-content/uploads/2022/06/Governor-Koshiyari-1024x569.jpg)
ఎన్సీపీకి చెందిన శరద్పవాల్, కాంగ్రెస్ పార్టీలు కలిసి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేలో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు రేకెత్తించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారని, చివరకు బలిచ్చే గొర్రెపిల్లలా మార్చారని మాజీ గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ విచారం వ్యక్తం చేశారు. తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాల గురించి మొదటిసారిగా ఓ ఆంగ్లచానల్ ఇంటర్వ్యూలో
జానికి ఉద్ధవ్ పట్ల తాను జాలిపడు తున్నాను అని కోష్యారీ చెప్పారు. శివసేన చీలిక, తన హయాంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సందేహాలకు బదులిస్తూ ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవి చేపట్ట కుండా ఉండాల్సిందని చెప్పారు. సీఎం పదవికి సరి పోయే వ్యక్తి కాదని అంటూ సొంత పార్టీని నడిపిస్తే బాగుండేదని తెలిపారు.
ఎంవీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన శాసన మండలికి నామినేట్ చేసేందుకు12 మంది అభ్య ర్ఖుల జాబితాను ఆమోదించక పోవడాన్ని కోష్యారీ సమర్థించుకున్నారు. చేయవలసినవి, చేయకూడనివి జాబితా చేస్తూ సీఎం ఐదు పేజీల లేఖ రాశారని చెప్పారు. చివరికి తాను 15 రోజులలోపు లేదా అంతకు ముందు సంతకం చేయాలని చెప్పారని తెలిపారు.
ఈ విషయం కోర్టుకు చేరిందని పేర్కొంటూ గవర్నర్కు ప్రభుత్వం నిబంధనలను నిర్దేశించే రాజ్యాంగ నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి నాలుగు లైన్ల లేఖ రాస్తారని, కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగిందని తెలిపారు. ఇంతకు ఆ లేఖ రాసిన సీఎం సలహాదారులు కొత్తవారేం కాని ఎద్దేవా చేశారు. నిబంధనలు బాగా తెలిసిన శరద్ పవార్ వంటి వారు అక్కడున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వ విమానాన్ని తనకు కేటాయించకుండా ఉద్ధవ్ తీసుకున్న నిర్ణయంపై మాట్లాడుతూ, “థాక్రే నన్ను విమానం నుంచి దించేశారు. విధి అతడిని సీఎం కుర్చీ నుంచి దించేసింది” అని చెప్పారు. బీజేపీ-షిండే కూటమి పట్ల పక్షపాత వైఖరి అవ లంబించారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మెజారిటీ ఉంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రావాల్సివుందని పేర్కొన్నారు.
కానీ అలా జరగలేదని, ఉద్ధవ్కు బదులుగా బీజేపీ ముందుకొచ్చిందని చెబుతూ శివసేనకు వరుడు లేని పెళ్లి కావాలి- అది ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు. “నేను ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ను కూడా అడిగాను. శరద్పవార్, భుజ్బల్తోనూ మాట్లాడాను. శివసైనికుడు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాత్రమే చెప్పారు” అని నాటి పరిణామాలను వివరించారు.
మెజారిటీని నిరూపించే ఒక్క మద్దతు లేఖ కూడా ఇవ్వలేక పోయారని కోష్యారీ పేర్కొన్నారు. గవర్నర్గా తాను ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని స్పష్టం చేశారు. ఫడ్నవిస్కు మద్దతు ఉందని నమ్మాను కాబట్టే ప్రమాణస్వీకారం చేయించానని తన చర్యను సమర్థించుకున్నారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా