ఉక్రెయిన్‌లో హెలికాప్ట‌ర్‌ కూలి హోంమంత్రితో పాటు 16 మంది మృతి

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ల  ఘోర విమాన ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్‌ కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఉక్రెయిన్ హోం మంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. హోం శాఖ మంత్రి డేనిస్ మోనాస్థిరిస్కీ సహా ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు. 
 
ప్ర‌మాద స‌మ‌యంలో అరుపులు, కేక‌లు వినిపించాయి. ఏ కార‌ణం చేత ప్ర‌మాదం జ‌రిగిందో ఇంకా తెలియ‌రాలేదు. బ్రోవ‌ర్ ప‌ట్ట‌ణంలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో 22 మంది గాయ‌ప‌డ్డారు. దాంట్లో ప‌ది మంది చిన్నారులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ‌వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బ్రోవ‌రీ పట్ట‌ణంలో ఉన్న కేజీ స్కూల్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కీవ్‌కు 8 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆ ప‌ట్ట‌ణంలో ల‌క్షా ప‌ది వేల మంది జ‌నాభా ఉన్నారు. హోంశాఖ మంత్రి మోన‌స్ట్రిస్కీతో పాటు డిప్యూటీ మంత్రి ఎవ్‌జ‌నీ యెనిన్‌, ఆ శాఖ‌కు చెందిన ఇత‌ర ఉన్నతాధికారులు ఉన్నారు.
 
హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కన ఉన్న బిల్డింగులకు మంటులు అంటుకోన్నాయి. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. మృతులు, బాధితుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా మారింది.  ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈశాన్య కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బ్రోవరీ టౌన్ ఉంది. బ్రోవరీ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఇటీవల రష్యా బలగాలు ప్రయత్నించగా, ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటించాయి