సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని సోమేశ్ కుమార్ను కోర్టు ఆదేశించింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మధ్యంతర ఉత్వర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. 2019, డిసెంబర్ నుంచి తెలంగాణ సీఎస్గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. అయితే సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు మూడు వారాలపాటు నిలిపివేశారు
తక్షణమే రాజీనామా చేయాలి
హైకోర్టు తీర్పు దృష్ట్యా సోమేశ్ కుమార్ తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని, ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ ఏపీకి బదిలీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
More Stories
రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం
కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం