న్యూ ఇయర్ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వంపై హైదరాబాద్ కు చెందిన ఓ పాస్టర్ చర్చిలో చేసిన ప్రసంగం అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేసింది. తనకు లభ్యమైన అమెరికన్ టాప్ సీక్రెట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం 2023లో భారతదేశంలో మతపరమైన దాడులు, మారణహోమం జరిగి లక్షల మంది క్రైస్తవులు చంపబడతారంటూ న్యూ ఇయర్ వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన పాస్టర్ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
ఇటీవల హైద్రాబాద్ ముషిరాబాద్ లోని మెన్నోనైట్ బ్రెత్రెన్ బెతల్ చర్చిలో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో ప్రధానవక్తగా ప్రసంగించిన కుంట ఎడ్వర్డ్ విలియమ్స్ అనే పాస్టర్ తన వ్యాఖ్యలతో అక్కడికి వచ్చిన క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేశాడు. భారత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెబుక్ నేజర్స్ లాంటివాళ్ళు అని, క్రైస్తవులను ఇరగ బాదటం వాళ్లకి దేవుడు అప్పజెప్పిన పని అన్నాడు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల 2023 సంవత్సరంలో మారణహోమం సృష్టించబడుతుందని, ఆ దారుణ మారణకాండలో లక్షలమంది క్రైస్తవులు కత్తిపోట్లకు, తుపాకీ కాల్పులకు చనిపోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
జర్మన్ నియంత హిట్లర్ యూదులపై జరిపిన మారణకాండను ఉదహరిస్తూ, భారతదేశంలో కూడా 2023లో అదే జరగబోతుందని, చర్చిలో వేదిక క్రింద కూర్చుని ఉన్నవారిని ఉద్దేశిస్తూ, వారిలో దాదాపు సగం మంది 2024లో కనిపించరని, 2024వ సంవత్సరాన్ని వారు చూడకుండా కత్తిపోట్లు, కాల్పులు, దెబ్బలతో చనిపోతారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు పాస్టర్ కుంట ఎడ్వర్డ్ విలియమ్స్.
ప్రపంచంలో మతపరమైన హింస విషయంలో స్థానం సౌదీ అరేబియా, సిరియా దేశాలను మించి భారత్ 8వ స్థానంలో ఉందని, భారత్ వైపు ప్రపంచమంతా చూస్తుంటే దేశాన్ని పాలిస్తున్న బిజెపి మాత్రం హైదరాబాద్ నుండి తెలంగాణను వేరు చేసి, హైదరాబాద్ ను యూనియన్ టెర్రటరీ చేయడం ద్వారా ఆ నగరం నుండి వస్తున్న ఆదాయాన్ని లాక్కునే ప్రణాళికలు చేస్తోందన్నాడు. భారతదేశ క్రైస్తవులకు హీరో కావడానికైనా, జీరో కావడానికైనా ఇదే అద్భుత అవకాశం అన్నాడు.
పాస్టర్ కుంట ఎడ్వర్డ్ విలియమ్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల హైద్రాబాద్ ముషిరాబాద్ లోని మెన్నోనైట్ బ్రెత్రెన్ బెతల్ చర్చిలో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సరం ప్రత్యేక కార్యక్రమంలో చేసిన ప్రసంగం తాలూకు పూర్తి వీడియోను చర్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది.
పాస్టర్ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pastor Edward Williams: There will be genocide in 2023 on th lines done by Hitler.Lakhs of people will be stabbed or shot to death.Most of you will not see 2024.
Fear & insecurity being drilled into church goers by rabid hate filled evangelists in Telugu states. #noconversion pic.twitter.com/rdDntACS7X— DharmaRakshak (@oldhandhyd) January 5, 2023
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పాస్టర్ కుంటమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ 2000 నుండి నిరీక్షణ టెలివిజన్కి హోస్ట్గా ఉన్నారు. CBN మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా స్పాన్సర్ చేయబడుతున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు TV9లో ప్రసారం చేయబడుతుంది. పాస్టర్ కుంటమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ 1990లో యూనియన్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియాలో స్టూడెంట్ కౌన్సెలర్గా చేరారు. దాదాపు పదేళ్లపాటు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులకు పరిచర్య చేశారు. ఆ తర్వాత 2006 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ గుండీ, ఐఐఎస్సీ బెంగళూరు, జేఎన్యూ ఢిల్లీ, సెంట్రల్ యూనివర్శిటీ పాండిచ్చేరి, జిప్మర్ పాండిచ్చేరి, సీఎంసీ వెల్లూరు వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సెమినార్లు నిర్వహించారు.
పాస్టర్ కుంటమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ భారతదేశంలో జన్మించిన కెనడియన్-అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు దివంగత ఫ్రెడరిక్ ఆంటోనీ రవి కుమార్ జకారియాస్ స్థాపించిన రవి జకారియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ (RZIM)లో శిక్షణ పొందినట్టు తెలుస్తోంది. ఫ్రెడరిక్ ఆంటోనీ రవి కుమార్ జకారియాస్పై గతంలో అనేక మంది మహిళలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పాస్టర్ కుంటమ్ ఎడ్వర్డ్ విలియమ్స్ భారతదేశంలో జన్మించిన కెనడియన్-అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు మరియు క్షమాపణ చెప్పే దివంగత ఫ్రెడరిక్ ఆంటోనీ రవి కుమార్ జకారియాస్ స్థాపించిన రవి జకారియాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ (RZIM) వద్ద క్షమాపణ నిపుణుడిగా శిక్షణ పొందారని కూడా తెలిసింది. అతను లైంగిక దుష్ప్రవర్తన వ్యక్తి అంటూ ఫ్రెడరిక్ ఆంటోనీ రవి కుమార్ జకారియాస్పై అనేక మంది మహిళలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
Source: Nijam Today English
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్