అవసరాల ఆధారిత స్కిల్ మ్యాపింగ్ కోసం గిరిరాజ్ సింగ్ పిలుపు

భారతదేశ యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి శిక్షణ కోసం అవసరాల ఆధారిత స్కిల్ మ్యాపింగ్ అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు.  ఉద్యోగ శిక్షణలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్న మంత్రి, దేశంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఎలక్ట్రానిక్, విద్య, శిక్షణ, ఐటి అండ్ బిపిఓ, పర్యాటకం, ఆతిథ్య రంగాలతో సాంప్రదాయ ట్రేడ్ లను ఎలా ఉత్తమంగా అనుసంధానించవచ్చో మార్గాలను అన్వేషించాలని మంత్రి కోరారు.

బెంగళూరులోని కుంబలగోడులో నేషనల్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (రుడ్సెట్) నూతన క్యాంపస్  ను ప్రారంభిస్తూ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు – ఆర్ఎస్ఇటిఐలు భారతదేశాన్ని ప్రధాన మానవ వనరుల కేంద్రంగా నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఆర్ఎస్ఇటిఐలు 44 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చాయని, వారిలో దాదాపు 31 లక్షల మంది అభ్యర్థులు స్థిరపడ్డారని గిరిరాజ్ సింగ్ చెప్పారుశిక్షణ పొందిన మొత్తం అభ్యర్థుల్లో 29 లక్షల మంది (66 శాతానికి పైగా)మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఇది ఆర్ఎస్ఇటిఐలు “మహిళా సాధికారతకు” చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయని రుజువు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 

రాబోయే 20 ఏళ్లలో భారత శ్రామిక శక్తి 32 శాతం పెరుగుతుందని, మొత్తం ప్రపంచ మానవశక్తి నాలుగు శాతం తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి నివేదికను డాక్టర్ గిరిరాజ్ సింగ్ ఉదహరించారు. శిక్షణ పొందిన అభ్యర్థులకు వారి విజయవంతమైన సెటిల్మెంట్ కోసం అవసరమైన రుణాలను అందుబాటులో ఉంచడానికి ఆర్ఎస్ఇటిఐలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఆయన వివరించారు.

శిక్షణ పొందిన 14.28 లక్షల మంది అభ్యర్థులకు లోన్ లింక్ చేసిన క్రెడిట్, క్యుములేటివ్ క్రెడిట్ పంపిణీ రూ.7200 కోట్లు. ఆర్ఎస్ఈటీఐ శిక్షణ పొందిన అభ్యర్థుల క్రెడిట్ లింకేజీ సగటు స్థాయి 51 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. బెంగళూరులోని ఎన్ఎఆర్ కొత్త క్యాంపస్ ప్రాజెక్ట్ కోసం రూ .25  కోట్లు ఆమోదించారు. రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఎకరాల భూమిని కేటాయించిందిప్రస్తుతం 27 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల లోని 572 జిల్లాల్లో 590 ఆర్ ఎస్ ఈటీఐలు పని చేస్తున్నాయి.

వీటిలో కర్ణాటకలో 33 ఆర్ఎస్ఇటిఐలు ఇప్పటివరకు 3.49 లక్షల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చాయి. ఆర్ఎస్ఇటిఐలను ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులతో సహా 24 బ్యాంకులు స్పాన్సర్ చేస్తాయి. అంతకుముందు, గిరిరాజ్ సింగ్ హాస్టల్ బ్లాక్ ను లాంఛనంగా ప్రారంభించారు, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొత్త క్యాంపస్ అడ్మిన్ బ్లాక్ ను ప్రారంభించారు.

కేంద్ర సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి,   ఫగ్గన్ సింగ్ కులస్తే, కర్ణాటక మంత్రులు డాక్టర్ సిఎన్ అశ్వథ్ నారాయణ్,  ఎస్ టి సోమశేఖర, ఎంపి , ఎన్ఎఆర్ అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.