తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు పెరుగుతున్న లవ్ జిహాద్ కేసులు 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లవ్ జిహాద్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని  విశ్వహిందూ పరిషత్ నేతలు  ఆందోళన వ్యక్తం చేశారు. భాగ్యనగర్, నిజామాబాద్, కర్నూలు, నెల్లూరు కేంద్రాలుగా ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 
 
శుక్రవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రచార విభాగం సమావేశంలో  పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి,  కార్యదర్శి పండరినాథ్,, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామిలు మాట్లాడారు. పరువుకు భయపడి చాలామంది హిందూ అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు ఈ విషయాలను పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లడం లేదని, ఒకవేళ తీసుకువెళ్లినా కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాలలోని పోలీస్ స్టేషన్ లలో నమోదైన ఎఫ్ ఐ ఆర్ లను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే 2000కు పైగా లవ్ జోహార్ కేసులు ఉన్నాయని వివరించారు. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొని లవ్ జిహాద్ అనే రాక్షస క్రీడా కొనసాగిస్తున్నారని  మండిపడ్డారు.
ప్రేమ పేరుతో హిందూ యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు గురి చేయడం, చిత్రహింసలుపెట్టడం, అవసరం తీరాక అమ్మి వేయడం,లేదా హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముస్లిం అబ్బాయిలు హిందూ పేర్లు పెట్టుకుని, హిందువుల జీవన విధానం అవలంబిస్తున్నట్టు బొట్టు పెట్టుకొని హిందూ అమ్మాయిలను ప్రేమ ముసుగులో ట్రాప్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం, మతం మార్చడం.. లేదంటే హత్యలు చేయడం సర్వసాధారణంగా సాగుతున్నాయని తెలిపారు.  ఇటీవల ఢిల్లీలో వెలుగు చూసినా శ్రద్ధ వాకర్- ఆస్తాబ్ ల ఘటనను ఓ ఉదాహరణగా పేర్కొంటూ తల్లి , తండ్రి కుటుంబాన్ని వదిలేసి వచ్చిన శ్రద్ధ వాకర్ అనే యువతిని 35 ముక్కలు నరికేసి ఫ్రిజ్లో దాచిపెట్టిన ఘటన యావత్ ప్రపంచాన్నే నిర్గాంత పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
లవ్ జిహాద్ కట్టడి కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కఠినంగా వ్యవహరించి హిందూ అమ్మాయిలను రక్షించాలని కోరారు. ప్రేమ పేరుతో మోసం చేసి, కాపురం చేస్తున్న సమయంలో హిందూ యువతులను చంపేసే వారిని బహిరంగంగా ఉరితీయాలని స్పష్టం చేశారు. 
 
ఇప్పటికైనా ప్రతి హిందూ యువతి మేల్కొని ప్రేమ విషయంలో గుడ్డిగా నమ్మకుండా, అవతలి వ్యక్తి నడవడికను గుర్తించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు సూచించారు. సాంకేతికత, సోషల్ మీడియా  ఆధారంగా హిందూ యువతులను వంచించే రాక్షసక్రీడ సాగుతోందని, దాని పేరే లవ్ జిహాద్ అని  హెచ్చరించారు. 
 
లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను ప్రలోభాలకు గురి చేసేందుకు కొన్ని సంస్థలు విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నాయని పేర్కొన్నారు. కులం ఆధారంగా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకొని వేటాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే విషయాన్ని ప్రతి సందర్భంలో విశ్వహిందూ పరిషత్ సమాజాన్ని జాగృతం చేస్తూ వస్తోందని పేర్కొన్నారు. ప్రతి కళాశాల, యూనివర్సిటీ కేంద్రంగా వచ్చే రోజులలో లవ్ జిహాద్ పేరుపైన సెమినార్లు నిర్వహిస్తామని వారు చెప్పారు. అందుకు ప్రత్యేకంగా దుర్గా వాహిని, బజరంగ్ దళ్ సంస్థలు యువతి యువతులను చైతన్య పరుస్తాయని చెప్పారు. 
 
హిందూ సమాజానికి ఇటువంటి విషయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా విశ్వహిందూ పరిషత్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర కోశాధికారి లక్ష్మీ శేఖర్, గోరక్ష క్షేత్ర ప్రముఖ్ యాదగిరి రావు, బజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ శివ రాములు తదితరులు పాల్గొన్నారు.