రైల్వే టిక్కెట్లలోడిజిటల్ చెల్లింపుల వాటాను పెంచాలి

రైల్వే టిక్కెట్ల జారీలో డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, యుపిఇని ఉపయోగించి పిఓఎస్ మెషీన్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపుల వాటాను పెంచాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (సిసిఎం- ప్యాసింజర్ మార్కెటింగ్) కె సాంబశివరావు సూచించారు. యుటిఎస్ మొబైల్ యాప్ వాటాను పెంపొందించడం, టిక్కెట్టులో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంపై రాజమండ్రిలో జరిగిన సెమినార్ లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ యుటిఎస్ యాప్ క్యూ లైన్‌లో వేచి ఉండకుండా అన్‌రిజర్వ్‌డ్ రైల్వే టిక్కెట్‌లను పొందడానికి సులభమైన మార్గం అని చెప్పారు. 
 
తొలుత ఆయన ప్రయాణీకులలో “యుటిఎస్” మొబైల్ యాప్‌ను స్వీకరించడం, ప్రధాన స్టేషన్లలో లభించే ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్ల వినియోగాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
 
యుటిఎస్‌ను స్వీకరించడం మరియు డిజిటల్, నగదు రహిత లావాదేవీలను పెంచడం ద్వారా సిబ్బందిపై పని భారం, స్టేషనరీ ప్రింటింగ్‌పై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొరోన్నారు.  టికెటింగ్‌లో యుటిఎస్ యాప్ వాటాను సంవత్సరాంతానికి 20 శాతంకు పెంచాలని, యుపిఇ  ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని డివిజనల్ సిబ్బందికి ఆయన విజ్ఞప్తి చేశారు.
 
విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు ప్రసంగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా స్టేషన్‌లలో “యుటిఎస్” యాప్, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్‌ల వంటి సులువైన టిక్కెట్‌లను సాంకేతికతను ఉపయోగించుకోవాలని, సులభతరమైన టిక్కెట్‌లను విస్తరింపజేయవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.
 
తీవ్ర అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రయాణికుల్లో యూటీఎస్ యాప్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా డివిజన్ వ్యాప్తంగా కొనుగోలు చేసే మొత్తం టికెట్లలో యూటీఎస్ టికెట్ల శాతాన్ని పెంచడంపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.
 
రాజమండ్రిలో జరిగిన ఈ సెమినార్‌లో విజయవాడ డివిజన్‌లోని బుకింగ్ సూపర్‌వైజర్లు, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లు, టిక్కెట్ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వేషన్ సూపర్‌వైజర్ల కేడర్‌లోని రైల్వే వాణిజ్య విభాగం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని దత్తత పెంచడంపై దృష్టి సారించి ప్రయాణీకుల వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడంపై తమ అభిప్రాయాలు/సూచనలను పంచుకున్నారు.