భద్రాద్రి రామాలయాన్ని ఇవాళ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేయనున్నారు. వేములవాడలో రాజన్న ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సుప్రభాత సేవ తర్వాత రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. సాయంత్రం 5:35 గంటల తర్వాత సంప్రోక్షణ, పూజాది కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం తిరుమంజనం నిర్వహించి, భక్తులకు సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ధర్మపురి ఆలయాన్ని నిత్యారాధన, నివేదన అనంతరం మూసివేయనున్నారు.
అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయంలో నిర్వహించాల్సిన చండీ హోమాన్ని రద్దు చేశారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి, హనుమకొండలో వేయి స్తంభాల గుడిని ఉదయం 9 గంటలకే మూసివేయనున్నారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు.
తిరుమలలో ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటలకు వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కనకదుర్గమ్మ ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి, ఆలయాన్ని తెరవనున్నారు.
రేపు ఆలయంలో అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. విశాఖ సింహాచలం, శ్రీకాకుళం అరసవల్లి ఆలయాలను కూడా మూసివేయనున్నారు.
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం