ఎవరూ బలవంతంగా మతం మార్చుకోవద్దని, హింసకు పాల్పడవద్దని ఇంద్రేష్ కుమార్ ఈ సందర్భంగా సూచింఛారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని, కులాన్ని గౌరవిస్తూనే, ఇతరుల కులాన్ని, మతాన్ని గౌరవించడం ద్వారా సమాజంలో సామరస్యత వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. ఇతరుల మతాన్ని విమర్శించడం లేదా అవమానించడం గానీ చేయకూడదని స్పష్టం చేశారు.
దేశంలో అన్ని మతాలను గౌరవించినప్పుడే దేశం శుక్రవారం రాళ్లు రువ్వే మతోన్మాదుల నుంచి విముక్తి పొందుతుందని చెప్పారు. ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించెడిది, ఆమోదించెడిది భారత దేశం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అన్ని పండగలు మనకు మతోన్మాదం, దురుద్దేశం, ద్వేషం, అల్లర్లు, యుద్ధం వంటివి వద్దని నేర్పుతాయని తెలిపారు. తాము శాంతి, సామరస్యం, సోదరభావాన్ని కోరుకుంటున్నామని చెప్పారు.
“భారతదేశంతో సహా ప్రపంచంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇది ప్రతి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఈ పండుగ అన్ని మతపరమైన విభేదాలు, ప్రాంతాల మధ్య విభేదాలను తొలగిస్తుంది. భారతదేశం తీర్థయాత్రలు, పండుగలు, జాతరల దేశం. వారు పేదలకు రొట్టెలు ఇస్తారు, వారి మధ్య సోదరభావాన్ని పెంచుతారు” అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
More Stories
ఒక్క సీటు కోసం ఉగ్రవాద సంస్థకు కాంగ్రెస్ మద్దతు
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు