దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో పలువురు నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై దాడులు జరపడం, పలువుర్ని విచారించడం చేసారు. అంతే కాదు ఈ కేసులో పలువుర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్టు చేసారు.
తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి డిల్లీకి తరలించారు. సీబీఐ కేంద్ర కార్యాలయం వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో ఆయనను విచారిస్తున్నారు. అభిషేక్ రావు స్టేట్మెంట్తో మరికొంత మందిపై సీబీఐ చర్యలు తీసుకోనుంది.
గతవారం హైదరాబాద్ లో ఈడీ సోదాలు జరిపిన ఓ మీడియా కార్యాలయంలో ఆ సంస్థకు అభిషేక్ నుండే ధనం బదిలీ అయినట్లు వెల్లడి కావడం గమనార్హం. మరి కొన్ని మీడియా సంస్థలకు సహితం పలు బినామీ లావాదేవీలు జరిగిన్నట్లు చెబుతున్నారు. దానితో అభిషేక్ ను విచారించిన అనంతరం మరిన్ని సంస్థలపై సోదాలు జరిపే అవకాశాలున్నాయి.
ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసింది సీబీఐ. విజయ్ నాయర్ను, సమీర్ మహేంద్రును అరెస్టు చేసిన సీబీఐ విజయ్ నాయర్ తర్వాత హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకుంది. ఓ కీలక టిఆర్ఎస్ నేతకు సమీప బంధువు కావడమే కాకుండా, పలువురు కీలక టిఆర్ఎస్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ రావు రాబిన్ డిస్టిలరీస్లో డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. అనూస్ బ్యూటీపార్లర్లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేయగా, అభిషేక్ రావు అరెస్ట్ రెండోది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్లు జరిగే అవకాశముందనే చర్చ నడుస్తోంది.
More Stories
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా