పర్యావరణ లక్ష్యాలపై ప్రపంచ దేశాల సహకారం ప్రమాదంలో పడిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. వచ్చేవారం ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ల సమావేశం జరగనుండటంతో ఓ నివేదికను విడుదల చేసింది.
ఉక్రెయిన్పై రష్యా సైనికచర్యలకు సంబంధించిన భౌగోళ రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, చైనా-అమెరికాల మధ్య సంబంధాలు క్షీణత వంటి కారణాలు వాతావరణ లక్ష్యాలను సాధించడంలో ప్రపంచ దేశాల సహకారాన్ని ప్రమాదంలో పడేశాయని పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు తక్షణ, విశ్వసనీయమైన, పారదర్శకమైన చర్యలు చేపట్టాల్సి వుందని సూచించింది.
భారీ నష్టాలతో కూడిన పర్యావరణ విపత్తులను ఎదుర్కొనేందుకు ఈ చర్యలు అత్యవసరమని పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండేలా చూసుకునేందుకు తగిన చర్యలు చేపట్టాల్సి వుందని పేర్కొంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కర్బన ఉద్గారాలను (జిహెచ్జిఎస్) తగ్గించాల్సి వుందని సూచించింది.
అంతర్జాతీయ సమన్వయంతో కర్బన ఉత్పత్తులపై ప్రతిపాదిత సుంకాలతో అధిక కర్బన ఉద్గారాలను అడ్డుకోవచ్చని పేర్కొంది. విభిన్న అంతర్జాతీయ ప్రమాణాలు ఏర్పడినట్లైతే.. దేశాల మధ్య కర్బన సుంకాలతో అధిక కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా అడ్డుకోవచ్చని తెలిపింది.
More Stories
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ 7వ ఛార్జీషీట్
ఎయిర్ఇండియా సిబ్బంది సమ్మె విరమణ
ఎస్బీఐకి 3 నెలల్లో రూ.20,698 కోట్ల లాభం