కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని తాను అనుకున్నప్పటికీ అది కాదని తేలిందని చెప్పారు.
వెంటనే మంటలు ఆర్పివేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. నిందితుడు ఫుటేజ్ లభించినట్టు చెప్పారు. కోయంబత్తూరులోని కోవైపుదూర్లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాడి ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేరళలోని కన్నూరులో సైతం ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఇదే తరహా దాడి జరిగింది. పీఎఫ్ఐ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ విసిరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడుల నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్కు చెందిన రెండు కంపెనీలను శుక్రవారం కోయంబత్తూరులో భద్రత కోసం మోహరించారు. తిరుప్పూర్, పొల్లాచ్చిలో భద్రత కోసం మరో రెండు కంపెనీలను రప్పించారు.
“ఈ బృందాలకు 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహించాలని, వాహనాల తనిఖీకి ఆదేశించామని, సున్నిత ప్రదేశాల్లో పోలీసులు నిఘా పెట్టారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ మున్నాని కార్యాలయాలకు రక్షణ కల్పించామని” కోయంబత్తూరుకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దాడులను అరికట్టాలని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు అన్ని పోలీసు కమిషనర్లు, జోనల్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలను అప్రమత్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పెట్రోలు బాంబులు విసిరి తమ అన్నదమ్ముల మనోధైర్యాన్ని తగ్గించగలమని ఎవరూ అనుకోవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులు సంఘవిద్రోహ శక్తులు తమ సామాజిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తాయని తెలిపారు. ఇదే విధమైన అభిప్రాయాలను ప్రతిధ్వనిస్తూ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎస్జి సూర్య బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై దాడుల చిత్రాలను విడుదల చేశారు.
“కోయంబత్తూర్ నుండి చెన్నై వరకు బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు జిహాదీల దాడిలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సామాజిక శక్తులను మొగ్గలోనే తుడిచిపెట్టి, సాధ్యమైనంత కఠినంగా శిక్షించి విచారించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు.
More Stories
కాంగ్రెస్ పార్టీకి రూ.1823 కోట్ల ఐటీ నోటీసు
భారతీయ వాయుసేనలో మరో దేశీయ అస్త్రం
బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన సూత్రధారి అరెస్టు