లీసెస్టర్లో భారతీయ సమాజంపై జరిగిన హింసను బ్రింతోం లోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు గురైన వారికి రక్షణ కల్పించాలని కోరింది.
“లీసెస్టర్లో భారతీయ సమాజానికి వ్యతిరేకంగా జరిగిన హింస, హిందూ మత ప్రాంగణాలు, చిహ్నాలను ధ్వంసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఈ విషయాన్ని బ్రిటన్ అధికారుల దృష్టికి స్పష్టంగా తీసుకు స్పష్టంగా వస్తున్నాము. ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరాము. బాధిత ప్రజలకు రక్షణ కల్పించాలని మేము అధికారులను కోరుతున్నాము” అని భారత హైకమిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆగస్ట్ 28న జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించిన తర్వాత, బ్రిటీష్ సిటీ లీసెస్టర్లో హింస చెలరేగింది. పాకిస్థాన్ సంతతికి చెందినవారు ఈ దురాగతానికి పాల్పడిన్నల్టు తెలుస్తున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నల్లని దుస్తులు ధరించిన వ్యక్తి భవనంపైకి వచ్చి కాషాయ జెండాను కిందకు లాగుతూ చూపరులు అతనిని ఉత్సాహపరిచాడు.
“పాకిస్తాన్ జిందాబాద్” (పాకిస్తాన్ లాంగ్ లివ్), “మోదీ కుట్టా, హై-హై” (కుక్క మోడీతో పాటు), “అల్లా-ఓ-అక్బర్” అని నినాదాలు చేస్తున్న గుంపులు పోలీసు సైరన్లు కూడా వినిపిస్తున్నట్లు ఇతర వీడియోలు చూపుతున్నాయి. ఒక ఇంటి నుండి పోలీస్ సహాయం కోరుతూ ఓ మహిళా అరుపులు కూడా వినిపిస్తున్నాయి.
లీసెస్టర్షైర్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ లోని భారత మాజీ హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ “చాలా భయంకరమైనది, కలవరపరిచేది” అని పేర్కొన్నారు.
More Stories
రష్యన్ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసిన యుక్రెయిన్
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
ఇరాన్పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి