కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజీనామాల పర్వం జరుగుతుంది. ఏ రోజు ఎవ్వరు పార్టీకి రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ లో పర్యటనకు సోమవారం రాహుల్ గాంధీ రావడానికి ఓ రోజు ముందే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేశారు.
ఆ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్సిన్హ్ వాఘేలా తన పదవికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. 35 ఏళ్ల వాఘేలా ఈ ఏడాది జనవరిలోనే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తన రాజీనామా తెలుపుతూ పార్టీ అధిష్టానానికివ్రాసిన లేఖలో తాను కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విశ్వనాథ్సింగ్ వాఘేలా ఏ పార్టీలో చేరుతారో అన్నది ఇంకా మాత్రం చెప్పలేదు.
కాంగ్రెస్ పార్టీ ”భారత్ జోడో యాత్ర” త్వరలో ప్రారంభం కానుండటం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్న నేపథ్యంలో ఈనెల 5న అహ్మదాబాద్లోని సబర్మతి రీవర్ప్రెంట్ వద్ద జరిగే ‘పరివర్తన్ సంకల్ప్’ సదస్సులో రాహుల్ పాల్గొంటున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు రాహుల్ ఈ సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు.
“రాహుల్ గాంధీ రేపు గుజరాత్కు వస్తున్నారు. ‘కాంగ్రెస్లో చేరండి’ అనే ప్రచారాన్ని చేపట్టనున్నారు. అయితే గుజరాత్లో ‘క్విట్ కాంగ్రెస్ ప్రచారం’ కొనసాగుతోంది” అంటూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ ఎద్దేవా చేశారు.
More Stories
అమేథిలో రాహుల్, రాయ్బరేలీలో ప్రియాంక పోటీ?
మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ నోటీసులు
ఏడాదికో ప్రధాని.. ‘ఇండియా’ కూటమి కొత్త ఫార్ములా