బావిలోనైనా మునుగుతాను కానీ.. కాంగ్రెస్‌లో మాత్రం చేరను

బావిలోనైనా మునుగుతాను కానీ.. కాంగ్రెస్‌లో చేరనని మాత్రం చేరను అని సీనియర్ బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఎందుకంటే తనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చవని తేల్చి చెప్పారు. 

నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగీస్తూ  తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరికపై ప్రస్తావించారు. ఓ మిత్రుడు తనకు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని సలహా ఇచ్చాడని గడ్కరీ పేర్కొన్నారు. అయితే, దీనికి తాను ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో మునగడం మేలు’ అని సమాధానం చెప్పినట్లు తెలిపారు. 

‘నా మిత్రుడు శ్రీకాంత్ జిచ్కార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. నేను మంచి వాడినని, ఉండకూడని పార్టీలో ఉన్నానని అన్నాడు. మంచి భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌లో చేరాలని నాకు చెప్పాడు. అప్పుడు ఆ పార్టీలో చేరికపై నేను జిచ్కార్‌కు తేల్చి చెప్పాను’ అని  వివరించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆత్మకథలోని వ్యక్తి ఓడిపోయినప్పుడు పూర్తికాదు, నిష్క్రమిస్తేనే పూర్తి అవుతాడన్న వాక్యాన్ని యువ పారిశ్రామికవేత్తలు గుర్తుంచుకోవాలని గడ్కరీ సూచించారు. 

వ్యాపారం, సామాజిక సేవ, రాజకీయాల్లో ఉన్న ఎవరికైనా మానవ సంబంధాలే అతిపెద్ద బలమన్న గడ్కరీ.. అందుకే ఎవరూ ఎవరిని వాడుకొని వదిలేయడం చేయకూడదని హితవు చెప్పారు. అవి ఎలాంటి రోజులైనా.. ఒకసారి ఎవరి చేయి పట్టుకున్నామంటే, దాన్ని ఎప్పటికీ వదిలేయవద్దు అని సూచించారు.