రక్షణ ఉత్పత్తుల స్వదేశీకరణకు మూడో జాబితాకు ఆమోదం 

‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ కింద రక్షణ తయారీలో స్వావలంబన కోసం మరియు కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల దిగుమతులను తగ్గించడం కోసం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడవ సానుకూల దేశీయీకరణ జాబితాకు ఆమోదం తెలిపారు. లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు /సబ్-సిస్టమ్‌లు/కాంపోనెంట్‌లు నిర్ణీత గడవు దాటిన తర్వాత దేశీయ పరిశ్రమ నుండి మాత్రమే కొనుగోలు చేస్తారు. 

 ఈ అంశాల వివరాలు శ్రిజన్ పోర్టల్ (www.srijandefence.gov.in)లో అందుబాటులో ఉన్నాయి. అవి జాబితాలో సూచించిన నిర్ణీత గడవు దాటిన తర్వాత  భారతీయ పరిశ్రమ నుండి మాత్రమే కొనుగోలు చేస్తారు. డిసెంబరు 2021, మార్చి 2022లో ప్రచురించిన  లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్‌లు/అసెంబ్లీలు/సబ్-అసెంబ్లీలు/భాగాల రెండు సానుకూల దేశీయీకరణ జాబితాలకు కొనసాగింపుగా ఈ జాబితా ఉంది.

ఈ జాబితాలలో ఇప్పటికే దేశీయంగా ఉన్న 2,500 అంశాలు, 458 (351+107) అంశాలు ఉన్నాయి. నిర్ణీత గడవు తర్వాత రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ స్వదేశీ చేయబడుతుంది. 458లో, 167 అంశాలు (1వ పిఐఎల్ -163, 2వ పిఐఎల్ -4) ఇప్పటివరకు స్వదేశీీకరించారు.

‘మేక్’ కేటగిరీ కింద వివిధ మార్గాల ద్వారా ఈ వస్తువుల తయారీ దేశీయీకరణ జరుగుతుంది. ‘మేక్’ కేటగిరీతో భారతీయ పరిశ్రమలో ఎక్కువ మందికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ పరిశ్రమ ద్వారా పరికరాలు, సిస్టమ్‌లు, ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు లేదా వాటి అప్‌గ్రేడ్‌ల రూపకల్పన మరియు అభివృద్ధితో కూడిన ప్రాజెక్ట్‌లను ఈ వర్గం కింద చేపట్టవచ్చు.

ఈ లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్‌లు/భాగాల దేశీయ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది.  కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు దిగుమతి ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అదనంగా, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ యొక్క డిజైన్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి మరియు ఈ సాంకేతికతలలో భారతదేశాన్ని డిజైన్ లీడర్‌గా ఎదగడానికి సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ/ప్రతిపాదనల కోసం అభ్యర్థనను విడుదల చేస్తాయి.  పరిశ్రమ పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి అవకాశం ఉంది.