దీనికి జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. కోర్టులు ముందుగానే ప్రారంభమవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అని చెప్పారు. ‘‘ఉదయం 9 గంటలకు విచారణ మొదలు పెట్టడం చక్కగా ఉంటుంది. మన పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూలుకు వెళుతున్నప్పుడు, మనం 9 గంటలకు కోర్టును ఎందుకు ప్రారంభించకూడదు? అని నేను తరచుగా చెబుతూనే ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవాలని, ఉదయం 11.30 గంటలకు అర గంట సేపు విరామం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ప్రారంభించాలని, దీనివల్ల సాయంత్రం మరిన్ని ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
వచ్చే నెల 27న ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవిని జస్టిస్ లలిత్ చేపట్టే అవకాశం ఉంది. ఆ పదవిని ఆయన చేపడితే ఆగస్టు 27 నుంచి నవంబరు 8 వరకు కొనసాగుతారు. దాంతో కోర్టుల సమయాన్ని అధికారికంగా మారుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.
More Stories
కాంగ్రెస్కు అధికారమిస్తే రామాలయాన్ని కూల్చేస్తారు
ఆప్ తనను `బిజెపి ఏజెంట్’ అనడంపై మండిపడ్డ స్వాతి మలివాల్
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం