* ఆషాఢ శుక్ల పక్ష పూర్ణిమ ప్రత్యేకత
గురు పూర్ణిమ (పూర్ణిమ) విజ్ఞులను, తమ జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్న విద్యా, ఆధ్యాత్మిక గురువులందరినీ గౌరవించే భారతీయ ఆచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతనీయులందరూ (హిందువులు, జైనులు, బౌద్ధులు మొదలైన) ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ వేడుక ఉద్దేశ్యం సాధారణంగా ఒకరి వ్యక్తిగత ఆధ్యాత్మిక గురువులను లేదా ఉపాధ్యాయులను గౌరవించడమే.
దీనిని జూన్ నుండి జూలై వరకు సాగే ఆషాఢ హిందూ నెలలో పౌర్ణమి (పూర్ణిమ) రోజున జరుపుకుంటారు. మహాభారతాన్ని రచించి, వేదాలను సమీకరించిన మహర్షి వేదవ్యాసుని జన్మదినాన్ని ఈ రోజున జరుపుకుంటారు కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. శివుడు సప్త ఋషులకు యోగ ప్రసారాన్ని ప్రారంభించినందున, శివుడు మొదటి గురువు అయిన సందర్భంగా కూడా ఈ రోజు జరుపుకుంటారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 1925లో హిందూ విప్లవకారుడు, సంస్కర్త డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఏర్పర్చిన వరవడి ప్రకారం జరుపుకొనే ఆరు పండుగలలో (వర్ష ప్రతిపద, విజయదశమి, మకర సంక్రాంతి, హిందూ సామ్రాజ్య దివాస్ (హిందూ సామ్రాజ్య దినం), గురు పూర్ణిమ, రక్షా బంధన్) ‘గురు పూర్ణిమ’ ఒకటి. భారతదేశంలో, విదేశాలలో విస్తరించి ఉన్న వివిధ శాఖలలో అధికారికంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.
ఈ రోజున, ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ, ‘గురు దక్షిణ (గురువుకు ప్రసాదం)’ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, భారతదేశ సంప్రదాయమైన ‘గురు-శిష్య (గురువు-శిష్యుడు) పరంపర’ పురాతన గౌరవనీయమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం; రెండవది, సంస్థ పనితీరు కోసం ఆర్ధిక వనరులను ఏర్పాటు చేయడం.
ఆర్ఎస్ఎస్ ప్రారంభ సంవత్సరాల్లో సంస్థాగత పని కోసం, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల నుండి మాత్రమే విరాళాలు తీసుకోవాలని నిర్ణయించారు. స్వయంసేవకులు, సైద్ధాంతిక శిక్షణతో పాటు, సంస్థాగత కార్యకలాపానికి ఉపయోగపడే ఆర్థిక సహకారం కూడా అందించే విధంగా సంస్థాగత కార్యకలాపంగా ‘గురు దక్షిణ’ రూపొందించారు.
ఆర్ఎస్ఎస్ వ్యక్తులను కాకుండా భగవాధ్వజ్ ( కాషాయ జెండా)ను `గురువు’గా పరిగణిస్తుంది. దీని వెనుక గల అతి ముఖ్యమైన సిద్ధాంతం, ఒక వ్యక్తి ఎంత గొప్పవారైనా కాలక్రమంలో కొన్ని బలహీనతలకు లోను కావచ్చు లేదా కొన్ని లోపాలు కలిగి ఉండవచ్చు. కానీ భగవద్వాజ్ అలా చేయదు. ఆర్ఎస్ఎస్లో కాషాయ జెండాను గురువుగా ఎంచుకోవాలనే నిర్ణయం ప్రధానంగా మూడు కారణాల వల్ల తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది:
ముందుగా, ఒక సంస్థను ఐక్యంగా నిలబెట్టడానికి, ఎదగడానికి, జెండా చారిత్రాత్మకంగా అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటిగా మిగిలిపోయింది. రెండవది, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రధాన నిర్మాణ భాగాలలో ఒకటైన సాంస్కృతిక జాతీయ వాదంకు సంబంధించి కాషాయ జెండాలో అత్యంత సమగ్రమైన ప్రతిబింబం కలిగి ఉంటుంది.
ముఖ్యంగా మూడవది, ఆర్ఎస్ఎస్ ఒక వ్యక్తికి బదులుగా సాంస్కృతిక జాతీయవాదం చిహ్నాన్ని అత్యున్నత స్థానంలో ఉంచడం ద్వారా వ్యక్తి-కేంద్రీకృత సంస్థగా మారకుండా తీసుకోవాలనుకుంటోంది. సంస్థ ‘అధిపతి’ అనే వివాదాస్పద సమస్యలో చిక్కుకోకుండా తొమ్మిది దశాబ్దాలకు పైగా జీవితంలోని అన్ని రంగాలను విస్తృతంగా విస్తరించిన సంస్థకు ఇది బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది.
అలాంటి ఏ సంస్థలోనూ వారసత్వ పోరు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాషాయ జెండాకు అత్యున్నత హోదా కల్పించే ఇలాంటి నిర్ణయాల ఘనత కూడా చాలా వరకు దక్కుతుంది. ఈ విధంగా, సంఘ్ పరివార్లోని ప్రతి ఒక్కరూ, సర్ సంఘచాలక్ తో సహా, చాలా గౌరవప్రదంగా కాషాయ జెండా ముందు తల వంచుతారు, ఆర్ఎస్ఎస్ శాఖలలో ఈ రెపరెపలాడే జెండాలు సంవత్సరం పొడవునా ప్రతిరోజూ సాంస్కృతిక జాతీయవాద స్ఫూర్తిని తెలియజేస్తుంటుంది.
ఇది బహుశా, ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు తమను తాము సాంస్కృతిక జాతీయ వాదం ఆలోచనతో ఎలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారో వివరించవచ్చు. ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖ, సంవత్సరంలో ఒక నిర్దిష్ట రోజున తన స్వయంసేవకుల కోసం ‘గురు దక్షిణ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది, ప్రాచీన భారత దేశంలోని ‘గురు-శిష్య (గురువు-శిష్యుడు)’ సంప్రదాయం పురాతన గౌరవప్రదమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం. రెండవది, సంస్థ పనితీరు కోసం అవసరమైన ఆర్ధిక వనరులను ఏర్పాటు చేయడం. విద్యార్థులు ప్రాచీన భారతదేశంలోని సాధువుల ఆశ్రమాలలో ఉండి, తమ విద్య , శిక్షణ పూర్తయిన తర్వాత, గురువుకు గౌరవసూచకంగా ‘దక్షిణ’ అందించేవారు.
హిందూ సంప్రదాయంలో, ‘నైవేద్యం’కు విలువ పట్టింపు లేదు, నిజంగా ముఖ్యమైనది ‘దక్షిణ’ ఇచ్చిన కృతజ్ఞతా భావం. ఉపాధ్యాయులు ఏది ఇచ్చినా తృప్తితో సమానంగా స్వీకరించేవారు. ఈ పవిత్ర సంప్రదాయాన్ని ఆర్ఎస్ఎస్ తన ‘శాఖ’లో ఆధునిక కాలంలో పునరుద్ధరించింది, ఇది ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు కొనసాగుతుంది.
ఇది హాలులో జరిగే సాధారణ వేడుక. సాధారణంగా, దీనిని దాదాపు 50-100 మంది కూర్చునే హాలులో నిర్వహిస్తారు. వేడుక సాధారణంగా ఉదయం జరుగుతుంది. దుస్తుల కోడ్, ‘అంతా తెలుపు’. గురు దక్షిణ రోజున, స్వయంసేవకులు భారతీయ సంప్రదాయ దుస్తులైన ‘కుర్తా-పైజామా’ లేదా ‘కుర్తా-ధోతీ’ ధరించడానికి ఇష్టపడతారు. పెద్ద గది/హాల్ ఆడిటోరియంలో కాషాయ జెండాను ఎగురవేస్తారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డా. హెడ్గేవార్, రెండవ సర్ సంఘచాలక్ ఎం ఎస్ గోల్వాల్కర్ (ఆర్ఎస్ఎస్లో ‘గురూజీ’ అని ప్రేమగా సంబోధిస్తారు) ఫోటోలను పక్కన ఉంచుతారు. స్వయంసేవకులందరూ నేలపై కూర్చుంటారు. స్వయంసేవకులు కార్యక్రమంకు ఖచ్చితంగా సమయానికి చేరుకోవడం తప్పనిసరి. అందరూ వరుసలలో కూర్చుంటారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు, వారికి తెల్లని సాదా కవర్లు ఇస్తారు. అందులో ఉన్న చీటీలలో ప్రతి వారు తమ పేరు, శాఖ పేరు, సమర్పణ మొత్తం సమాచారం తెలుపుతారు.
గురుదక్షిణ కార్యక్రమం చాలా సరళమైనది కానీ ప్రబలంగా ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా కనీసం కొత్తవారికి బాగా ఆకట్టుకుంటుంది. స్వయంసేవకులు భారతదేశపు ‘స్వర్ణయుగాన్ని’ గుర్తు చేసుకుంటూ కొన్ని దేశభక్తి గీతాలను కలిసి పాడతారు. దేశ నిర్మాణ ప్రక్రియలో భాగం కావడం ద్వారా ఆ యుగాన్ని తిరిగి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తారు.
అప్పుడు స్వయంసేవకులు ఒక్కొక్కరుగా లేచి, కాషాయ జెండా దగ్గర ట్రేలో ఉంచిన కొన్ని పూల రేకులను సమర్పించి, భూమికి సమాంతరంగా నేరుగా కుడి అరచేతితో జెండాకు తల వంచుతారు (ఆ విధంగా రోజూవారీ శాఖ కార్యక్రమాలలో స్వయంసేవకులు ఎల్లప్పుడూ భగవద్వాజ్ ముందు తల వంచుతారు). దీన్ని ఆర్ఎస్ఎస్ లో ‘ధ్వజ్ ప్రాణం’ అంటారు. అనగా. కాషాయ జెండాను గౌరవంగా పలకరిస్తున్నారు.
స్వయంసేవకులు తాము సమర్పించే మొత్తాన్ని(ఇంత మొత్తం కనీసం ఉంచాలనే నియమం లేదు) ఆ కవర్ లో ఉంచి (కవరులో ఉంచవలసిన నిర్ణీత మొత్తం లేదు. దాని గురించి ఎవరూ అడగరు), దానిని భగవద్వాజ్ వద్ద ఉంచుతారు. ఎంత మొత్తం సమర్పించారో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరు అడగను కూడా అడగరు. స్వయంసేవక్ మళ్లీ ‘ధ్వజ్ ప్రాణం’ చేసి, తిరిగి వచ్చి వరుసలో తన స్థానంలో కూర్చుంటారు. యు తదుపరి స్వయంసేవక్ వెళ్లి అదే విధంగా ‘గురు దక్షిణ’ సమర్పిస్తారు.
‘గురుదక్షిణ’ తర్వాత, ఆ సందర్భంగా ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్లోని సీనియర్ కార్యకర్తలలో వారిలో ఒకరు లేదా ప్రత్యేకంగా ఆహ్వానించిన మరో అతిథి క్లుప్తంగా మేధోపరమైన ప్రసంగం చేస్తారు.
గురుదక్షిణ అనేది సంస్థ విస్తరణకు మద్దతుగా, “అత్యున్నత అధిపతి”గా భగవద్వాజ్ ప్రాముఖ్యతను నిర్ధారించి, సంస్థ లోపల నుండి నిధులను సేకరించడానికి రెండు-కోణాల చర్యగా పూర్వపు రోజులలో రూపొందించారు. కాలక్రమేణా, ‘గురు దక్షిణ’ కార్యక్రమం, సాధారణంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు క్రమం తప్పకుండా హాజరుకాని స్వయంసేవకులతో కూడా సంపర్కం కావడానికి గొప్ప మాధ్యమంగా మారింది.
దీని ద్వారా కనీసం సంవత్సరానికి ఒకసారి, సంఘ శాఖకు హాజరవడం జరుగుతుంది. కొన్నేళ్లుగా, ఆర్ఎస్ఎస్ స్పూర్తితో సమాజంలోని అనేక రంగాలలో పని చేస్తున్న స్వయంసేవకులు దేశవ్యాప్తంగా విస్తరించడంతో, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలలో లేదా ఇతర ప్రదేశాలలో నిర్దిష్ట ‘గురు దక్షిణ’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరు కాకపోవచ్చు కానీ కొన్ని ఇతర సంస్థల్లో పనిచేస్తుండవచ్చు. కాబట్టి మీరు జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ ప్రభావిత సంస్థల సభ్యుల కోసం ప్రత్యేక గురుదక్షిణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ని విమర్శించే కొందరు కూడా అవినీతితో నిండిన సమాజంలో ఇది విజయవంతమైన నమూనా అని అంగీకరిస్తారు. వాస్తవానికి, ఆర్ఎస్ఎస్ విధుల ప్రకారం అన్ని విజయవంతమైన ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు కీలకం ‘బలమైన పాత్ర’. గురుదక్షిణ సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు. సాధారణంగా పక్షం లేదా ఒక నెల వ్యవధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
More Stories
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
చాబహార్ పోర్ట్పై భారత్ – ఇరాన్ ల మధ్య చారిత్రక ఒప్పందం
ఏపీలో అర్ధరాత్రి వరకు పోలింగ్.. 80 శాతానికి చేరువలో ఓటింగ్