పశ్చిమ జపాన్లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జపాన్లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే (67)పై కాల్పులు జరిగాయి. దానితో గుండె ఆగి కుప్పకూలిన్నట్లు చెబుతున్నారు. అబేను ఆసుపత్రికి తరలించేలోపు కార్డియోపల్మోనరీ అరెస్ట్లో ఉన్నట్లు నారా అగ్నిమాపక విభాగం తెలిపింది
జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ఎన్ హెచ్ కె ప్రకారం , అబే శుక్రవారం ఉదయం షాట్గన్తో వెనుక నుండి కాల్చిన తర్వాత నేలపై పడి ఛాతీ నుండి రక్తస్రావం అవుతున్నట్లు కనిపించింది. 40 ఏళ్ల నారా నివాసి టెత్సుయా యమగామి అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే తదుపరి వివరాలను అందించలేదని తెలిపింది.
అబే ప్రతి ద్రవ్యోల్బణం నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడటం కోసం అనుసరించిన “అబెనోమిక్స్” విధానాలకు ప్రసిద్ధి చెందారు. జపాన్ సైన్యాన్ని బబలోపేతం చేశారు. తన పదవీ కాలంలో చైనా పెరుగుతున్న పలుకుబడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. 2006 నుంచి 2012 వరకు జపాన్ ప్రధానిగా షింజో అబే సేవలందించారు. భారత్తో సత్సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో ఆయనకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది.
మరో జపాన్ మీడియా హౌస్ క్యోడో ప్రకారం మాజీ ప్రపంచ నాయకుడు అపస్మారక స్థితిలో, కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్లో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయ కుటుంబానికి చెందిన అబే, దీర్ఘకాలిక అనారోగ్యంతో తిరిగి బయటపడిన తర్వాత 2020లో పదవీ విరమణ చేయాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. జపాన్ లో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా వార్తల్లో నిలిచారు. భారత దేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్న ఆయన 2006, 2014, 2015, 2017లలో మన దేశాన్ని సందర్శించారు.
“ఉదయం 11.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) తుపాకీ కాల్పులు జరిగాయి. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిస్టర్ అబే పరిస్థితి తెలియదు. ఇటువంటి హింస అనుమతించం. మేము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. మేము సాధ్యమైన ప్రతి చర్య తీసుకుంటాము” అని వివరించారు.
More Stories
పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది
సీఎం రమేష్ అరెస్ట్.. కాన్వాయ్ పై వైసీపీ నేతల దాడి
మాదిగలు, బిసిలు కాంగ్రెస్కు ఓటేయవద్దు