ఆదివారం అర్ధరాత్రి అస్సాం రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఫలితాలను ప్రకటించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఫలితాలపై స్పందిస్తూ “అపూర్వమైన ప్రజా తీర్పు” అని పేర్కొన్నారు.
ఆరవ షెడ్యూల్లోని అస్సాంలోని పురాతన గిరిజన కౌన్సిల్లలో ఒకటైన కార్బిలో జూన్ 8న ఓటింగ్ జరిగింది. గతంలో మికిర్ హిల్స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని దీనిని పిలిచేవారు, దీని ప్రధాన కార్యాలయం దిఫులో ఉంది. ఇది1952లో ఏర్పడింది. దీని అధికార పరిధిలో రెండు జిల్లాలు ఉన్నాయి. కర్బీ అంగ్లాంగ్, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్, నాలుగు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటరీ నియోజకవర్గం (డిఫు) దీని పరిధిలోకి వస్తాయి.
కాంగ్రెస్ 2001 నుండి 2015 వరకు దీనిని పాలించింది. అయితే 2016లో అస్సాంలో బిజెపి తన మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు తులిరామ్ రోంగ్హాంగ్తో సహా చాలా మంది కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు అదే సంవత్సరం బీజేపీలో చేరారు.
బిజెపి విజయాన్ని ఊహించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. గత వారం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుండి కొత్తగా ఏర్పడిన ఆల్ పార్టీ హిల్స్ లీడర్స్ కాన్ఫరెన్స్, పాత పార్టీ అటానమస్ స్టేట్ డిమాండ్ కమిటీ లతో పాటు కొత్తగా రంగ ప్రవేశం చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ పడ్డాయి. ఆప్ కేవలం ఒక స్థానంలో రెండో స్థానంలో నిలిచింది.
ఫలితాల తర్వాత అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సబర్వాల్ బిజెపి అస్సాంను అభినందించారు. గత 8 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న పూర్తి నమ్మకాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అంటూ ఆయన ట్వీట్ చేశారు.
More Stories
తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన
వేముల రోహిత్ దళిత్ కాదు…. కేసు మూసివేత
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు