75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబుతున్న ప్రస్తుత తరుణంలో రాబోయే 25 సంవత్సరాలకు దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే విధంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా జూన్ 4 నుంచి జూలై 9 వరకు జోనల్, సబ్-జోనల్ స్థాయిలో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా జూన్ 9న విశాఖపట్నంలో “ఆశావాహ జిల్లాలపై జోనల్ సమావేశం” జరగనుంది.
ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి. స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధికారులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పరా మహేంద్రభాయ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సమావేశానికి స్థానిక పార్లమెంటు సభ్యులు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సాంఘిక సంక్షేమ / మహిళా, శిశు శాఖల మంత్రులు హాజరవుతారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన రాష్ట్ర శాసనసభ సభ్యులు కూడా సమావేశంలో పాల్గొంటారు. మహిళా, శిశు అభివృద్ధి / సాంఘిక సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శులు/ కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరవుతారు.
జిల్లా పరిషత్/పంచాయత్, ఎన్ సి డబ్ల్యు, ఎస్ సి డబ్ల్యు, ఎన్ సి పి సి ఆర్, ఎస్ పి సి ఆర్, ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్, యుఎన్, మహిళలు , పౌర సమాజ సంస్థల వంటి అంతర్జాతీయ ఏజెన్సీల ప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశంలోని మహిళలు, పిల్లల సాధికారత కోసం నూతనోత్తేజంతో, నిబద్ధతతో, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మూడు కొత్త మిషన్లను ప్రారంభించింది. అవి, మిషన్ సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య.
మిషన్ సక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 మహిళలు, పిల్లల పోషకాహార సమృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది, మిషన్ శక్తి మహిళల భద్రత, పునరావాసం, సాధికారత కోసం సమగ్ర పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ వాత్సల్య శిశు సంక్షేమం, పిల్లల రక్షణతో సహా సమగ్ర అభివృద్ధికి తోడ్పడనుంది.
సమావేశపు ముఖ్యోద్దేశం గతంలో సాధించిన లక్ష్యాలను గుర్తుచేసుకోడమే కాకుండా వాటి స్ఫూర్తితో రానున్న కాలంలో మహిళలు, పిల్లల అభివృద్ధికి, సాధికారత దిశగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేయబోతున్న నిరంతర కృషిని తెలియజేయడం.
More Stories
మళ్లీ అధికారంలోకి వస్తున్నామని జగన్ ధీమా
ఎమ్యెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
రాయలసీమ, పల్నాడు హింసపై గవర్నర్ కు కూటమి నేతల ఫిర్యాదు