గోదావరి జలాలు, ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన పలు అభ్యంతరాలను జీఆర్ఎంబీ ఛైర్మన్ తిరస్కరించారని తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్లపై హైదరాబాద్లోని జలసౌదలో 13వ గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ ) సమావేశం జరిగింది.
అయితే ఈ ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపులు జరగలేదని స్పష్టం చేసినట్లు ఏపి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషన్ కుమార్ మీడియాకు వివరించారు. ఎప్పటిలాగే ఈ విషయమై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు వాదోపవాదాలకు దిగిన్నట్లు తెలిసింది.
సమావేశం అనంతరం రజత్ కుమార్ మాట్లాడుతూ బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు డైవర్ట్ చేస్తోందని.. అందులో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలని పేర్కొన్నారు.
తెలంగాణకు చెందిన చనాకా-కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి #హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై, ఆంధ్రప్రదెశ్కు చెందిన వెంకటనగరం పంప్హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపైనా చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే సీడబ్ల్యూసీకి నివేదక పంపించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఏపీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ఆ అభ్యంతరాలును జీఆర్ఎంబీ ఛైర్మన్ తిరస్కరించినట్లు చెప్పారు.
గెజిట్ నోటిఫికేష న్ సబ్ కమిటీ ద్వారా వివరాలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పినట్లు పేర్కొన్నారు. ఛైర్మన్ ఎంపీ సింగ్ అన్ని అంశాలను నోట్ చేసుకున్నారని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న చనాకాకొరాటా, చౌటుపల్లి హన్మంతరెడ్డి , చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు ట్రిబ్యునల్ నీటికేటాయింపులు చేయలేదని, అందువల్ల ఆ ప్రాజెక్టుల డిపిఆర్లకు బోర్డు ముందు అభ్యంతరాలు తెలిపామని శశిభూషన్ కుమార్ వెల్లడించారు. అశాస్త్రీయంగా సిడబ్యుసి ఈ ప్రాజెక్టుల డిపిఆర్కు ఎలా అనుమతి ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఈ ఎత్తిపోతల పథకాల వల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులకు నీటిలభ్యత తగ్గిపోందని బోర్డు చైర్మన్కు తెలిపామని తెలిపారు.
సీలేరు ప్రాజెక్టు వివరాలు ఏపార్మాట్లో కావాలో లేఖ రాస్తే వివరాలు అందజేస్తామని బోర్డుకు తెలిపామని చెప్పారు.
కాగా, గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. అయితే, ఈ రెండు అంశాలు తమపరిధిలో లేవని బోర్డు చైర్మన్ వెల్లడించారని శశిభూషన్ కుమార్ తెలిపారు.
సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్ అమలు, గోదావరి నదిపై రెండు రాష్ట్రాల్లో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు, వాటి అనుమతులు బోర్డు నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం , సీడ్ మని తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ