బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. రేవంత్… జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా ? అని ఆమె సవాల్ చేశారు.
టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, వాళ్లద్దరూ కుమక్కై మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతున్నరని అంటూ అరుణ ప్రత్యారోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్ (పీకే) సాక్షిగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నయని ఆమె ఆరోపించారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ములేక ఈ కుమ్మక్కు రాజకీయాలకు దిగుతున్నారని అరుణ ధ్వజమెత్తారు.
బండి సంజయ్ చేపడుతుతున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆమె విమర్శించారు. రాళ్లు విసిరి, అలజడి సృష్టించి పాదయాత్రను ఆపాలనుకున్న టీఆర్ఎస్ నాయకులు యాత్రకు వస్తున్న స్పందనను చూశాక దిక్కుతోచక అడ్డగోలుగా మాట్లాడుతున్నరని ఆమె మండిపడ్డారు.
వాళ్లు వాడుతున్న భాష, పద్దతిని చూసి జనం ఛీదరించుకుంటున్నరని, కేటీఆర్ వాడుతున్న భాష జుగుప్పాకరంగా ఉందని అరుణ మండిపడ్డాయిరు. ఎడమ కాలి చెప్పుతో పదవిని తన్నేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆ పదవి కోసమే మీరు అడ్డమైన గడ్డి తింటున్నారని ఆమె ధ్వజమెత్తారు. వేలాది కోట్లు దోచుకుని ఓట్లను కొనాలనుకుంటున్నది ఎందుకు? అని అరుణ ప్రశ్నించారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్