పేటియం పేమెంట్ బ్యాంక్ తమ వినియోగదారుల సమాచారాన్ని విదేశీ సంస్థలతో పంచుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొత్త ఖాతాలను తెరవడాన్ని నిలిపివేయాల్సిందిగా ఇటీవల ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.
పేటియం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్ చేశారని బ్లూమ్బర్గ్ నివేదికలో పేర్కొంది. బ్యాంక్లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేటియం పేమెంట్స్ బ్యాంకు విదేశాల్లోని సర్వర్లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు చెబుతున్నారు.
దీనిని ఆర్బిఐ తన వార్షిక తనిఖీల్లో గుర్తించడంతో.. ఆ సంస్థ కొత్త ఖాతాలను చేర్చుకోవడంపై నిషేధం విధించినట్లు బ్లూమ్బర్గ్ పేర్కొంది. ఐటి వ్యవస్థపై నిర్వహించేందుకు ఓ ఐటి ఆడిట్ సంస్థను నియమించు కోవాలని ఆర్బిఐ సూచించింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది.
కాగా, ఇప్పటికీ తీవ్ర నష్టాల్లో సాగుతున్న పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు ఆర్బిఐ తాజా ఆంక్షలతో కుప్పకూలాయి. సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్లో ఈ షేర్ 12.21 శాతం క్షీణించి రూ.680.40కి పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.45,461.55 కోట్లకు పరిమితమ య్యింది.
ఈ సంస్థ ఐపిఒ లిస్టింగ్ ధర రూ.2,150గా ఉంది. దీంతో పోల్చితే ఇప్పటి వరకు దాదాపు 70 శాతం విలువ తుడుచుకు పెట్టుకు పోయింది. దీంతో ఐపిఒలో స్టాక్స్ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూడటంతో బోరుమంటున్నారు.
More Stories
మహారాష్ట్ర నుండి ఉల్లి ఎగుమతులకు అనుమతి
రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ