59,000 మండలాల్లో, దాదాపు 41 శాతం మండలాలో భౌతిక శాఖల రూపంలో సంఘ కార్యం జరుగుతున్నది. 2303 పట్టణ ప్రాంతాలలో 94 శాతం చోట్ల శాఖ పనులు జరుగుతున్నాయి . అన్ని మండలాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూలై మధ్య మధ్యలో 104 చోట్ల సంఘ్ శిక్షా వర్గాలు (ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాలు) ఉంటాయని, ఒక్కో వర్గానికి సగటున 300 మంది ఉంటారని ఆయన వివరించారు.
కరోనా కాలంలో, సంఘ్ వాలంటీర్లు సమాజంతో కలిసి సేవా కార్యాన్ని (వారి స్వచ్ఛంద సేవలను) చురుకుగా అందించారని దత్తాత్రేయ తెలిపారు. మహమ్మారి మొదటి రోజు నుండి 5.50 లక్షల మంది స్వయంసేవకులు సేవా కార్యాన్ని ప్రారంభించారు. మఠాలు, దేవాలయాలు, గురుద్వారాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సేవా కార్యానికి తరలి వచ్చిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం. ఇది మేల్కొన్న దేశానికి సంకేతం అని దత్తాత్రేయ వివరించారు.
సంఘ్లో కుటుంబ ప్రబోధన్ (కుటుంబ అవగాహన), గౌ-సంవర్ధన్ (ఆవుల పోషణ), గ్రామీణ వికాస్ (గ్రామీణాభివృద్ధి) కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని చెబుతూ స్వయంసేవకులను సంఘ్ కార్యానికి ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశం ప్రారంభంలో, గత సంవత్సరం మరణించిన ప్రముఖులందరికీ నివాళులు అర్పించారు. వారిలో ప్రముఖులు భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్, సిసిఎస్ జనరల్ బిపిన్ రావత్, బాబాసాహెబ్ పురందరే, రాహుల్ బజాజ్, పండిట్ బిర్జు మహారాజ్ , పి. శ్రీనివాస రామానుజాచార్య స్వామి కూడా ఉన్నారు.
మీడియా సమావేశంలో అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్, సహ ప్రచార్ ప్రముఖ్ నరేంద్ర కుమార్, అలోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు
బాధితులపైనే హత్యాయత్నం కేసు నమోదు
తెలంగాణాలో పెరుగుతున్న హిందువులపై దాడులు