ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ 1400 మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాబందుల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి సొమ్మతో బలుపెక్కి మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగ రాస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని మండి పడ్డారు.
శాశ్వతంగా తన కుటుంబమే రాజ్యమేలేలా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తేవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. “కేసీఆర్….. ఇది రాచరికం కాదు. నిజాం నవాబు లా పాలించడానికి…. చైనాలో జిన్ పింగ్, రష్యాలో పుతిన్ మాదిరిగా అధికార కాంక్షతో మదమెక్కి కొట్టుకుంటున్నావ్. నీ పాలన అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్” అంటూ సంజయ్ హెచ్చరించారు.
సామాన్య ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన కేసీఆర్ చివరకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లతో ఎములాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానంటూ దేవుడికే శఠగోపం పెట్టిన కేసీఆర్ పాపాలు పండాయని విమర్శించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మరింతమంది పీకేలను పెట్టుకున్నా కేసీఆర్ ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ప్రజాలిచ్చే తీర్పు తో కొట్టుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పారు.
More Stories
తెలంగాణాలో అన్ని స్థానాల్లో బిజెపి క్లీన్స్వీ ప్
పోలీసుల తీరుపై మాధవీలత అసహనం
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా మోదీ