సీఎస్ సోమేశ్ కుమార్ పై క్యాట్ సీరియస్

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్క్యా (క్యాట్) ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించింది. 
 
తామిచ్చిన ఆదేశాలతోనే ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్.. తెలంగాణ సీఎస్ గా ఉన్నారని గుర్తు చేసింది క్యాట్ హైదరాబాద్ బెంచ్. అంతేకాదు ఇప్పుడు తమ ఆదేశాలను పాటించకపోతే ఇప్పటికిప్పుడే ఏపీకి పంపిస్తామని హెచ్చరించింది. దీంతోపాటు కోర్టు ధిక్కరణ కింద జైలు పంపిస్తామని కూడా హెచ్చరించింది.

ఏపీ సర్కార్ తనను రిలీవ్ చేసినా తెలంగాణ సర్కార్ విధుల్లోకి తీసుకోవడం లేదని అభిషేక్ మహంతి  క్యాట్ దృష్టికి తీసుకెళ్లారు.  ఇదే కేసులో సీఎస్ సోమేష్ కుమార్ నిన్న క్యాట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంపై తీవ్ర అసంతృప్తి క్యాట్ వ్యక్తం చేసింది.  వెంటనే వర్చువల్ విధానంలో హాజరు కావాలని చెప్పడంతో గంట సేపట్లో క్యాట్ విచారణకు హాజరయ్యారు.

పలు అంశాలను ఐపీఎస్ అభిషేకం మహంతికి క్యాట్ కు వివరించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మీని క్యాట్ ఆదేశాలతో ఏపీకి ఐదు రోజుల్లో రిలీవ్ చేశారని వారి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కో అధికారి కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరి వివక్ష కనిపిస్తోందని క్యాట్ కు అభిషేక్ మొహంతి ఫిర్యాదు చేశారు.  దీంతో మార్చి 11లోపు అభిషేక్ మొహంతికి పోస్టింగ్ ఇవ్వాలని, అదే రోజు విచారణకు హాజరుకావాలని హైదరాబాద్ బెంచ్ క్యాట్ ఆదేశించింది.