* జన్మదిన నివాళి
సంత్ గడగే బాబా మహారాజ్ 19వ శతాబ్దపు గొప్ప మహాపురుషులలో ఒకరు. నిస్సహాయులు, పేదల కోసం తపించి, ఎన్నో సామజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 1876లో షెన్ గావ్ (జిల్లా దర్యాపూర్, మహారాష్ట్ర)లో జన్మించారు. ఆయన అసలు పేరు దేబు లేదా దేబుజీ. ఆయన తండ్రి పేరు జింగరాజీ, తల్లి సఖు. వారు కులపరంగా చాకలివారు అయితే వారి వృత్తి వ్యవసాయం.
దేబుకు ఎనిమిదేళ్ల వయస్సులో ఆయన తండ్రి 1884లో మరణించాడు. అతని తండ్రికి చెందిన చిన్న భూమి తనఖా కిందకి రావడంతో రుణదాత (సాహుకార్) స్వాధీనం చేసుకోవడంతో ఆయన , కుటుంబానికి జీవనోపాధి లేకుండా పోయింది. దేబు, తన తల్లితో కలిసి, హపురే (అకోలా జిల్లా, మహారాష్ట్రలోని) అనే గ్రామంలో 55 ఎకరాల భూమి గల చంద్ర భాన్ అనే తన మామతో కలిసి జీవించడానికి వెళ్లాడు.
దేబు తన పదిహేనేళ్ల వయసులో కుంతాబాయితో వివాహం చేసుకున్నాడు. అతను చాలా చురుకైన, తెలివైన పరిశీలన కలిగిన వ్యక్తి. గ్రామస్తులతో తన ప్రత్యక్ష సన్నిహిత పరిచయం ద్వారా, సాధారణ రైతులు, ఇతర గ్రామ వర్గాల దుర్భర పేదరికం, వారి మూఢనమ్మకాలు, వెనుకబడిన సామాజిక పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు.
సమాజ సేవలోనే భగవంతుని సేవ ఉందని ధృడంగా విశ్వసించి, చివరకు తన ఇంటిని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. తదనుగుణంగా 1 ఫిబ్రవరి 1905న తన ఇంటిని విడిచిపెట్టాడు. గృహస్థుని జీవితంలో తిరిగి స్థిరపడటానికి తిరిగి రాలేదు.
నడుముకు చిరిగిన గుడ్డ, చిరిగిన రంగురంగుల చొక్కాతో కుట్టిన రంగు ముక్కలు లేదా గుడ్డలను మరాఠీలో ‘గోధాడి’ అని పిలుస్తారు. తన మారుపేరు ‘గోధాడే-బాబా’ అని పెట్టుకున్నాడు. తనతో ఒక వెదురు కర్రను మాత్రమే తీసుకున్నాడు. అతని దగ్గరలో ఉన్న ఒక గిన్నె (దీనిని మరాఠీలో ‘గడగే’ అని పిలుస్తారు) ఉండడంతో ‘గడగే బాబా’ గా ప్రసిద్ధి పొందాడు.
అతని ఉపన్యాసాల మార్గం చాలా స్పష్టంగా, సరళంగా ఉండెడిది. ఎందుకంటే అతను ప్రసంగించిన భాష గ్రామీణ మాండలికం కావడంతో ప్రజలను నేరుగా ఆకర్షించెడిది. అతని ఉపన్యాసాలు గ్రామ జీవిత అనుభవాల నుండి, ఉపమానాల ద్వారా అతని ఉపన్యాసాల సంపదతో ఉత్తేజపరిచెవి. మహారాష్ట్ర సాధువుల, ముఖ్యంగా తుకారాం సాహిత్యం నుండి సముచితమైన పద్యాలు, పాటలతో విభజించారు.
తన ప్రయాణంలో, గాదగే బాబా పంఢర్పూర్, నాసిక్, అలంది వంటి యాత్రా కేంద్రాలను సందర్శించారు. భగవంతుడు ఒక్కడే అని, సమస్త జీవరాశులను, మనిషిని, మృగాన్ని ప్రేమించడమే పొందే ఏకైక మార్గం అని బోధించాడు. కుల-భేదాలు, అంటరానితనం, బాల్య వివాహాలు, దేవతలకు నైవేద్యాలలో మేక, కోడి వంటి జంతువులను చంపడం, మద్యం సేవించడం వ్యతిరేకిస్తూ పరిశుభ్రత, ధర్మం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకున్నాడు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్