
ఏబీజీ షిప్యార్డ్ రుణాల కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ సీఎండీ రిషి కమలేశ్ అగర్వాల్తోపాటు మరో 8 మంది నిందితులపై లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు సీబీఐ వెల్లడించింది. నిందితులందరూ భారత్లోనే ఉన్నారని, దేశం విడిచి వెళ్లే వీలులేకుండా నోటీసులు జారీచేశామని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేసినట్టు వెల్లడించింది.
కాగా… ఏబీజీ షిప్యార్డ్ బ్యాంకు ఖాతాను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే… అంటే 2013లోనే నిరర్థక ఆస్తిగా ప్రకటించారని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ఎస్బీఐ ప్రకటించిందని వివరించింది.
ఎస్బీఐ ఫిర్యాదు ప్రకారం… రూ.22,842 కోట్ల నిరర్థక ఆస్తులను ప్రకటించారని, ఈ రుణాల్లో అధిక భాగం ఐసీఐసీఐ నేతృత్వంలోని 28 బ్యాంకుల కన్సార్షియం 2005 నుంచి 2012 మధ్య కాలంలోనే పంపిణీ చేసిందని, ఇందులో ఎస్బీఐ కూడా ఉందని మంగళవారం ఓ ప్రకటనలో సీబీఐ తెలిపింది.
అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులు ఏబీజీ షిప్యార్డ్ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటించడం విశేషం. గుజరాత్కు చెందిన ఏబీజీ షిప్యార్డ్ కంపెనీ… దేశంలోని పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.23వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని, ఆ సొమ్మును ఇతర అవసరాలను మళ్లించినట్టు బయటపడటంతో సీబీఐ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
More Stories
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం
జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి