కర్ణాటక హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో ఈ అంశంపై చర్చిస్తామని పేర్కొంది. విద్యా సంస్థలు తెరవచ్చునని, అయితే మతపరమైన దుస్తులను ధరిచరాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయొద్దని.. సరైన సమయంలో దీనిపై చర్చిస్తామని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సూచించారు. ఈ కేసు దీర్ఘ కాల పరిణామాలను కలిగి ఉందని, 10 సంవత్సరాలుగా విద్యార్థులు హిజాబ్ ధరిస్తున్నారంటూ.. విచారణకు న్యాయవాది ఒత్తిడి తీసుకురాగా.. ‘ ఈ విషయాన్ని పెద్దదిగా చేయవద్దని కోరారు.
“హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. ఆదేశాలు వెలువడక ముందే ఏం చేయగలం?. ఏమి జరుగుతుందో మాకు తెలుసు. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు. ఈ సమస్యను జాతీయ స్థాయికి.. అంటే ఢిల్లీ వరకు తీసుకురావడం సమంజసమేనా? ఏదైనా తప్పు జరిగితే.. మేం జోక్యం చేసుకుంటాం’ అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు.
ఇదే పిటిషన్పై వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు అని తుషార్ అభ్యర్ధించారు.
ఇదిలా ఉండగా.. గురువారం ఫాతిమా బుష్రా అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం తోసిపుచ్చింది. ఆమె తరపున వాదనలు వినిపించిన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఈ అంశం దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘మేం పరిశీలిస్తాం’ అంటూ చీఫ్ జస్టిస్ రమణ పేర్కొన్నారు.
More Stories
హిమాచల్లో సుఖు సర్కారు కుప్పకూలిపోవచ్చు
ఇంగ్లాండ్ మ్యాచ్లో రికార్డులు సృష్టిస్తున్న జైస్వాల్
రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు